ఆంధ్రప్రదేశ్లో టిడ్కో ఇళ్లకు మోక్షం లభిస్తోంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పేదల ఆశలు నెరవేరుతున్నాయ్. స్టేట్వైడ్గా లబ్ధిదారులకు ఇళ్లను కేటాయిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే పలు జిల్లాల్లో టిడ్కో ఇళ్లను అందజేసిన సర్కార్, లేటెస్ట్గా మంగళగిరిలో ప్రారంభించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించారు మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్. స్థానిక ఎమ్మెల్యే ఆర్కేతో కలిసి లబ్దిదారులకు సేల్ డీలు అందజేశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇళ్లు కేటాయింపులు చేయడంతో సంతోషంగా గృహప్రవేశాలు చేశారు లబ్ధిదారులు. అనంతరం, వైఎస్సార్ అండ్ వైఎస్ జగన్ బ్యానర్లకు పాలాభిషేకం చేశారు.
గత ప్రభుత్వం పేదలందరికీ టిడ్కో ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా కాలయాపన చేశారని విమర్శించారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వసతులతో కూడిన ఇళ్లు నిర్మించినట్టు తెలిపారు. సొంతింటి కల నిజమైనందుకు సంతోషం వ్యక్తంచేస్తున్నారు లబ్ధిదారులు. అన్ని సౌకర్యాలతో ఇళ్లను నిర్మించి ఇవ్వడమే కాకుండా, ఒక్క రూపాయికే వాటిని రిజిస్ట్రేషన్చేసి ఇవ్వడంపై హ్యాపీ ఫీలవుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..