Andhra Pradesh: విశాఖ ఫిషింగ్ హార్బర్లో దారుణం.. ప్రాణం తీసిన సెల్ ఫోన్ ఘర్షణ..!
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ముగ్గురు కూలీల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణాలమీదకు తెచ్చింది. పండుగ పూట విషాదాన్ని నింపింది. సెల్ఫోన్ కోసం ప్రారంభమైన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ముగ్గురు కూలీల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణాలమీదకు తెచ్చింది. పండుగ పూట విషాదాన్ని నింపింది. సెల్ఫోన్ కోసం ప్రారంభమైన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్ రెండో నెంబర్ జెట్టిలో బోట్ డ్రైవరు, బోట్ వాచ్మెన్లు మధ్య ఘర్షణ జరిగింది. నిద్రిస్తున్న దేముడును లేపిన మరో ఇద్దరు.. కాల్ చేసేందుకు సెల్ ఫోన్ అడిగారు. అప్పటికే నిద్రలో ఉన్న దేముడు నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన మరో ఇద్దరు.. దేముడుపై దాడి చేశారు. కొన ఊపిరితో బోట్ డ్రైవర్ కంబాల దేముడిని చికిత్స కొరకు కేజీహెచ్ తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బోటు డ్రైవర్ కంబల దేముడు మృతి చెందాడు. మృతుడు దేముడు అచ్యుతాపురం పూడిమడక గ్రామం. పరారిలో ఉన్న నిందితులీద్దరు బోటు వాచ్మెన్లే. ఈ ఇద్దరు నిందితలు భీమిలి వద్ద అన్నవరం చెందినవారుగా గుర్తించిన పోలీసులు.. గాలిస్తున్నారు. కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..