AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala Rush: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వ దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. సోమవారం స్వామిని 73,007 మంది దర్శించుకోగా.. 25,733 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.04 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇకపోతే, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 6 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది.

Tirumala Rush: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వ దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..
Ttd
Jyothi Gadda
|

Updated on: Apr 01, 2025 | 9:14 AM

Share

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల తాకిడీ పెరిగింది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. సోమవారం స్వామిని 73,007 మంది దర్శించుకోగా.. 25,733 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.04 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇకపోతే, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 6 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది.

ఇదిలా ఉంటే, భక్తుల రద్దీకి అనుగుణంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది టీటీడీ. ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనాల పరంగా మార్పులు చేపట్టనుంది. గతంలో బ్రేక్ దర్శనాల విషయంలో అనేక సిఫారసుల ద్వారా టికెట్లు పొందేందుకు వీలుండగా ఉండేది. కానీ, ఇప్పుడు దీనిని గణనీయంగా తగ్గించేందుకు టీటీడీ కసరత్తు మొదలుపెట్టింది. భక్తులకు మరింత సౌకర్యంగా దర్శనం కల్పించేందుకు, వసతి ఏర్పాట్ల కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు గానూ గూగుల్‌తో ఒప్పందాన్ని కూడా టీటీడీ పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.