AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anantapur Crime: విషాదాంతమైన మూడు నెలల చిన్నారి మిస్సింగ్ కేసు, కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే..

కనీవినీ ఎరుగనంత కిరాతకం, మానవత్వానికే మాయనిమచ్చ. కంటికి రెప్పలా కాపాడాల్సిన ముక్కుపచ్చలారని కన్నబిడ్డను అత్యంత దుర్మార్గంగా

Anantapur Crime:  విషాదాంతమైన మూడు నెలల చిన్నారి మిస్సింగ్ కేసు, కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే..
Father Murder
Venkata Narayana
|

Updated on: Oct 22, 2021 | 12:37 PM

Share

Anantapuram: కనీవినీ ఎరుగనంత కిరాతకం, మానవత్వానికే మాయనిమచ్చ. కంటికి రెప్పలా కాపాడాల్సిన ముక్కుపచ్చలారని కన్నబిడ్డను అత్యంత దుర్మార్గంగా అంతమొదించాడా తండ్రి. ఇలా.. అనంతపురంలో కనిపించకుండాపోయిన రెండు నెలల పసికందు మిస్సింగ్ మిస్టరీ తీవ్ర విషాదాంతంగా మిగిలింది. కన్నబిడ్డను చంపింది కసాయి తండ్రిని నిర్ధారణ అయింది. భార్యపై అనుమానంతో గత కొన్ని రోజులుగా గొడవలు రేగుతున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం పసికందును తీసుకొని పారిపోయిన తండ్రి మల్లికార్జున ఇంతటి క్రూరత్వానికి పాల్పడ్డాడు .

కళ్యాణదుర్గం సమీపంలోని చెరువు వద్ద చిన్నారిని చంపి పాతి పెట్టిన దుర్మార్గపు తండ్రి. తల్లి చిట్టెమ్మ ఫిర్యాదుతో నిన్నటి నుంచి గాలిస్తున్న పోలీసులు.. అనంతపురంలో నిందితుడిని అరెస్టు చేశారు. విచారించగా చిన్నారిని చంపి పాతిపెట్టినట్లు ఒప్పుకున్న కసాయి తండ్రి మల్లికార్జున ఒప్పుకున్నాడు.

ఇలా ఉండగా, కళ్లు తెరిచి లోకం చూడకుండానే చిన్నారి చిట్టితల్లి సొంత తండ్రిక కారణంగానే కానరాని లోకాలకు వెళ్లిపోయింది. మూడంటే మూడే నెలల ఆ చిన్నారిని కన్నతండ్రే చంపడం అందరి మనసులను కలచివేస్తోంది. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామంలో చోటు చేసుకుంది. బ్యాంకు ఉద్యోగి అయిన మల్లిఖార్జున్‌, అతని భార్య మధ్య గొడవ జరిగింది. వీరిద్దరి మధ్య ఘర్షణ అనంతరం భర్త.. భార్యను ఆస్పత్రిలో చేర్పించి మూడు నెలల పాపను తీసుకెళ్లినట్లు భార్య వెల్లడించింది. అయితే తన పాపను భర్త మల్లీ చెరువులో పడేసినట్లు చిట్టెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు పాప కోసం గాలింపు చర్యలు చేపట్టగా అసలు విషయం బయటపడింది.

Read also: Lady constable: ఇదీ.. ఉద్యోగం చేసే విధానం.. లేడీ కానిస్టేబుల్ అబ్బురపరిచే ముందు చూపు. వాచ్.. వీడియో