AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kannababu: ఏపీలో ఎన్నడూ లేనివిధంగా వైఎస్సార్ రైతు భరోసా, సున్నావడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవా పథకాలు: మంత్రి కన్నబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు రైతు భరోసా కింద రాష్ట్ర రైతాంగానికి రూ.18,777 కోట్లు ఇచ్చామని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి క‌న్నబాబు చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రి

Kannababu:  ఏపీలో ఎన్నడూ లేనివిధంగా వైఎస్సార్ రైతు భరోసా, సున్నావడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవా పథకాలు: మంత్రి కన్నబాబు
Kannababu
Venkata Narayana
|

Updated on: Oct 26, 2021 | 7:54 PM

Share

AP minister Kannababu: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు రైతు భరోసా కింద రాష్ట్ర రైతాంగానికి రూ.18,777 కోట్లు ఇచ్చామని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి క‌న్నబాబు చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా, సున్నావడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవా పథకాలను ప్రారంభించారని ఆయన వెల్లడించారు. టీడీపీ హయాంలో పంట రుణ మాఫీ కింద రూ.12,500 కోట్లు ఇస్తే ఈ రెండున్నరేళ్లలో 18,777 కోట్లు ఇచ్చాం. మేనిఫెస్టోలో రైతు కోసం ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

పనిలోపనిగా టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై కన్నబాబు నిప్పులు చెరిగారు. “కేవలం తన రాజకీయాల కోసం ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర ప్రజల ఖ్యాతిని చంద్రబాబు తగ్గిస్తున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు ఢిల్లీ వీధుల్లో చెప్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల ఇతర రాష్ట్రాలు ఏమనుకుంటాయి. మీరు తిట్టిన తిట్లు వాళ్లకి గుర్తు ఉండవా..? రాష్ట్రపతి రాజధాని గురించి అడిగితే నాశనం చేశారని చెప్పారట. పదేళ్ల హక్కును వదిలేసి ఇక్కడికి పారిపోయి వచ్చి మేమేదో నాశనం చేశామని చెప్పారట. మీ రియల్ ఎస్టేట్ అవసరాల కోసం మూడు రాజధానులు అడ్డుకుని మాపై నిందలా? అని మంత్రి నిప్పులు చెరిగారు.

ముప్పై ఏళ్ల ఇండస్ట్రీ అంటూ దిగజారుడు రాజకీయాలు చేసి ఢిల్లీ వీధుల్లో డ్రామాలు చేస్తున్నారా? అని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. “పార్టీ బతికుందని చెప్పుకునే ప్రయత్నం కాదా?. పుస్తకాల్లో పేర్లు రాసుకోవడం కాదు మా కార్యకర్తపై చెయ్యి వేసి చూడండి. ఈ డ్రామాలన్నీ మోదీ, అమిత్ షాలకు తెలుసు. వాళ్లకి ఇక్కడి వాస్తవ పరిస్థితులు తెలియవా? ఆయన మాట్లాడిన మాటలు వాళ్లకు తెలియదా..?. తప్పకుండా ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేస్తాం. ఎప్పుడు 356 పెట్టాలో వాళ్ళకి తెలియదా?” చంద్రబాబుకి ముందు నిబద్ధత, క్రమశిక్షణ, కట్టుబాటు లేదు అంటూ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు త‌న‌ రియల్ ఎస్టేట్ అవసరాల కోసం మూడు రాజధానులు అడ్డుకుని మాపై నిందలు వేస్తున్నాడ‌ని క‌న్నబాబు మండిప‌డ్డారు.

Read also: Huzurabad By Election: హుజురాబాద్ బీజేపీ మ్యానిఫెస్టోలో నియోజకవర్గ ప్రజలకి బంపరాఫర్లు