AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ సర్కార్‌‌కు ‘ప్రపంచ బ్యాంక్’ భారీ షాక్

ఏపీ సర్కార్‌కు ప్రపంచ బ్యాంక్ భారీ షాక్ ఇచ్చింది. రాజధాని అమరావతి ప్రాజెక్ట్ నిర్మాణం నుంచి ప్రపంచబ్యాంక్ తప్పుకుంది. ఈ మేరకు ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లోని ప్రాజెక్ట్& ఆపరేషన్స్‌ సెక్షన్‌లో ఉన్న అమరావతి నిర్మాణం అనే ప్రాజెక్ట్ స్టేటస్‌లో ‘డ్రాప్డ్’ అంటూ పెట్టేసింది. అయితే దీనిపై ప్రపంచ బ్యాంక్ అధికారుల నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై మానవ హక్కుల ఫోరమ్ అధికారి రోహిత్ గుత్తా మాట్లాడుతూ.. ‘‘నిన్నటి వరకు ఈ ప్రాజెక్ట్ […]

ఏపీ సర్కార్‌‌కు ‘ప్రపంచ బ్యాంక్’ భారీ షాక్
TV9 Telugu Digital Desk
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Jul 19, 2019 | 11:36 AM

Share

ఏపీ సర్కార్‌కు ప్రపంచ బ్యాంక్ భారీ షాక్ ఇచ్చింది. రాజధాని అమరావతి ప్రాజెక్ట్ నిర్మాణం నుంచి ప్రపంచబ్యాంక్ తప్పుకుంది. ఈ మేరకు ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లోని ప్రాజెక్ట్& ఆపరేషన్స్‌ సెక్షన్‌లో ఉన్న అమరావతి నిర్మాణం అనే ప్రాజెక్ట్ స్టేటస్‌లో ‘డ్రాప్డ్’ అంటూ పెట్టేసింది. అయితే దీనిపై ప్రపంచ బ్యాంక్ అధికారుల నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై మానవ హక్కుల ఫోరమ్ అధికారి రోహిత్ గుత్తా మాట్లాడుతూ.. ‘‘నిన్నటి వరకు ఈ ప్రాజెక్ట్ స్టేటస్‌లో ‘ఇన్ పైప్‌లైన్’ అని ఉండేది. అయితే ఇవాళ అందులో ‘డ్రాప్డ్’ అని పెట్టారు’’ అని పేర్కొన్నారు.

మరోవైపు ఈ అంశంపై ఏపీ సీఆర్డీఏ కమిషనర్ లక్ష్మీనరసింహన్ మాట్లాడుతూ.. ‘‘దీనిపై ప్రపంచ బ్యాంక్‌ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. రుణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. రుణాన్ని తీసుకువచ్చేలా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని భావించాం’’ అని పేర్కొన్నారు. అయితే అమరావతి నిర్మాణం కోసం నిధులు కావాలంటూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 2016లో ప్రపంచ బ్యాంక్‌‌కు  ఓ వినతి పత్రాన్ని పంపింది. అందులో భాగంగా 300మిలియన్ డాలర్లు రుణాలు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఒప్పుకుంది. అలాగే మరో 200మిలియన్ డార్లు ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే రాజధాని కోసం తమ భూములను బలవంతంగా లాక్కున్నారని ఆ మధ్యన కొందరు రైతులు ప్రపంచ బ్యాంక్‌కు మెయిల్ ద్వారా ఫిర్యాదులు చేశారు. దీంతో రుణ ప్రక్రియ నిలిచిపోయింది.

అయితే ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. దేశ గర్వించదగ్గ రాజధానిగా అమరావతిని నిర్మించాలనుకున్నారు. అయితే రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో రాజధానిని నిర్మించడం వల్ల వరదలు వచ్చే అవకాశం ఉందని, అక్కడి పంట భూములు బీడుగా మారుతాయని, దాదాపు 20వేల కుటుంబాలు రోడ్డున పడుతాయని పలువురు సామాజిక కార్యకర్తలు తమ అభిప్రాయాలను తెలిపిన విషయం తెలిసిందే.