జంబో బోర్డుపై ఎవరికీ వారే.. యమునా తీరే !!

కనివిని ఎరుగని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇందులో ఆధ్యాత్మిక భావనాలున్న వారికీ పెద్ద పీట వేయడంతో సభ్యుల ఎంపికపై ఎవరు పెద్దగా కామెంట్ చేసేందుకు అవకాశం కూడా దక్కలేదు. ఆధ్యాత్మిక భవనాలు, హిందూ ధర్మ పరి రక్షణ, ప్రచారానికి ప్రాధాన్యత నిచ్చే వారికీ టీటీడీ ట్రస్ట్ బోర్డులో సభ్యత్వం కల్పించడాన్ని చాలా మంది ప్రశంసించారు కూడా. కానీ ఒక్క […]

జంబో బోర్డుపై ఎవరికీ వారే.. యమునా తీరే !!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 21, 2019 | 6:43 PM

కనివిని ఎరుగని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇందులో ఆధ్యాత్మిక భావనాలున్న వారికీ పెద్ద పీట వేయడంతో సభ్యుల ఎంపికపై ఎవరు పెద్దగా కామెంట్ చేసేందుకు అవకాశం కూడా దక్కలేదు. ఆధ్యాత్మిక భవనాలు, హిందూ ధర్మ పరి రక్షణ, ప్రచారానికి ప్రాధాన్యత నిచ్చే వారికీ టీటీడీ ట్రస్ట్ బోర్డులో సభ్యత్వం కల్పించడాన్ని చాలా మంది ప్రశంసించారు కూడా. కానీ ఒక్క విషయం మాత్రం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఇబ్బంది కరంగా పరిణమించే సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంలో టీటీడీకి 20కి మించకుండా ట్రస్ట్ బోర్డు సభ్యులతో కమిటీ ఏర్పాటయ్యేది. కానీ, ఈసారి ఏకంగా ఆరు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ, సభ్యులు, ఎక్స్-అఫిషియో సభ్యులు, గౌరవ సలహా మండలి సభ్యులు అంటూ 36 మందికి అవకాశం కల్పిస్తూ జంబో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ విషయం కమలం నేతలకు కంటగింపుగా మారినట్టు కనిపిస్తోంది. కమలం నేతలకు అవకాశం ఇవ్వకపోవడంతో లేక మరేదైనా ఇతర కారణమో కానీ.. జంబో ట్రస్ట్ బోర్డు ఎందుకు అంటూ విమర్శలతో విరుచుకుపడుతోంది. బీజేపీ సీనియర్ నేత భానుప్రకాష్ రెడ్డి ఇప్పటికే నాలుగు జీవోలతో 36 మందికి ఛాన్స్ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మరో రెండు జీవోలతో అర్ద సెంచరీ తో టీటీడీ ట్రస్ట్ బోర్డు రికార్డును బద్దలు కొడతారని ఎద్దేవా చేస్తున్నారు. మరో వైపు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి విషయంలో సీఎం వైఎస్ జగన్ వ్యవహరిచిన తీరుపై కాంగ్రెస్ నేతలు కూడా మంది పడుతున్నారు. 36 మంది సభ్యులను నియమించడంపై కోర్టుకెళ్లేందుకు సిద్ధమని కాంగ్రెస్ నేత, రాయలసీమ హక్కుల పోరాట సమితి నేత నవీన్ ప్రకటించారు. 36 మంది పాలక మండలి సభ్యులు… కుటుంబసభ్యులతో సహా వస్తే… ప్రమాణ స్వీకార మండపం అయిన వాహన మండపం సరిపోదని… టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. టీటీడీ గురించి … జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని సూచించారు. 36 మంది సభ్యులను నియమించడం ఎంత వరకు సమంజసమని .. టీటీడీ చట్టాన్ని తుంగలో తొక్కి ఇష్టానుసారంగా బోర్డును నియమించారని మండిపడ్డారు. తిరుమల శ్రీవారి ఆలయం ఏమైనా జగన్‌ సొంత ఆలయమా?.. ప్రజల ఆలయమా? అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పాలక మండలి ఉందన్నారు. తాము రాజకీయంగా ఆరోపణలు చేయడం లేదన్నారు. పాలక మండలికి సంబంధించిన నాలుగు జీవోలను రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మొత్తానికి బీజేపీ, కాంగ్రెస్ నేతల అభ్యంతరాలతో టీటీడీ ట్రస్ట్ బోర్డు వ్యవహారం రసకందాయం పడినట్లయింది.

ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..