AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక ఏపీలో ‘స్థానిక’ సంస్థల ఎన్నికల నగారా!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ శుక్రవారం సమీక్షించారు. ఏపీలో 13,060 గ్రామ పంచాయతీలకు తర్వలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. గతంలో 60శాతం రిజర్వేషన్లను అమలు చేశామని, సుప్రీంకోర్టు 50శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయరాదని తాజాగా ఆదేశించిందని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై కొత్త ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మొదటి దశలో గ్రామ […]

ఇక ఏపీలో ‘స్థానిక’ సంస్థల ఎన్నికల నగారా!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 03, 2019 | 5:36 PM

Share

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ శుక్రవారం సమీక్షించారు. ఏపీలో 13,060 గ్రామ పంచాయతీలకు తర్వలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. గతంలో 60శాతం రిజర్వేషన్లను అమలు చేశామని, సుప్రీంకోర్టు 50శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయరాదని తాజాగా ఆదేశించిందని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై కొత్త ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.

మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మొదటి దశలో గ్రామ పంచాయతీలకు, రెండో దశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మూడోదశలో మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. బ్యాలెట్‌ విధానంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఈవీఎంలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టంచేశారు.