అమరావతిలో భూముల రిజిస్ట్రేషన్ ధర పెంపు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెరిగాయి. రాజధానిలోని 29గ్రామాల్లో భూముల ధరల పెంపు ప్రతిపాదనల దస్త్రానికి సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఆగష్టు ఒకటో తేది నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. అయితే ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో గజం ధర రూ.1000 ఉండగా.. రూ.2,500కు పెంచారు. రూ.2,500 ఉన్నచోట రూ.5వేల వరకు పెరిగాయి. అలాగే గుంటూరు జిల్లా వ్యాప్తంగా సగటున రూ.200 నుంచి రూ.2వేలకు మించి పెంపుదల లేదు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెరిగాయి. రాజధానిలోని 29గ్రామాల్లో భూముల ధరల పెంపు ప్రతిపాదనల దస్త్రానికి సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఆగష్టు ఒకటో తేది నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. అయితే ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో గజం ధర రూ.1000 ఉండగా.. రూ.2,500కు పెంచారు. రూ.2,500 ఉన్నచోట రూ.5వేల వరకు పెరిగాయి. అలాగే గుంటూరు జిల్లా వ్యాప్తంగా సగటున రూ.200 నుంచి రూ.2వేలకు మించి పెంపుదల లేదు.