15 ఏళ్ల పాటు జగనే సీఎం – స్వరూపానందేంద్ర స్వామి

విజయవాడలో జరిగిన ఉత్తరాధికార దీక్షలో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరికి విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వాదం ఇచ్చారు. అటు కేసీఆర్, ఇటు జగన్ అంటే తనకు ఎనలేని అభిమానమని స్వామిజీ అందరి సమక్షంలో తన మనసులోని మాటను బహిర్గతం చేశారు. 15 ఏళ్ల పాటు జగనే సీఎం… కేసీఆర్ మహాభారతాన్ని రెండు సార్లు చదివారని.. అటువంటి ముఖ్యమంత్రి దేశంలో మరెవరూ లేరని స్వరూపానందేంద్ర స్వామి తన ప్రసంగంలో […]

15 ఏళ్ల పాటు జగనే సీఎం - స్వరూపానందేంద్ర స్వామి
Follow us

|

Updated on: Jun 17, 2019 | 8:22 PM

విజయవాడలో జరిగిన ఉత్తరాధికార దీక్షలో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరికి విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వాదం ఇచ్చారు. అటు కేసీఆర్, ఇటు జగన్ అంటే తనకు ఎనలేని అభిమానమని స్వామిజీ అందరి సమక్షంలో తన మనసులోని మాటను బహిర్గతం చేశారు.

15 ఏళ్ల పాటు జగనే సీఎం…

కేసీఆర్ మహాభారతాన్ని రెండు సార్లు చదివారని.. అటువంటి ముఖ్యమంత్రి దేశంలో మరెవరూ లేరని స్వరూపానందేంద్ర స్వామి తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. ఏపీలో దేవాదాయ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని.. వాటిని కాపాడగల శక్తి ఒక్క జగన్‌కి మాత్రమే ఉందన్నారు. దేవతల ఆశీర్వాదంతో ఇద్దరు సీఎంలు 15 ఏళ్లు పరిపాలించాలని, అప్పటివరకు శారదపీఠం కార్యక్రమాలు చేస్తుందని స్వామిజీ చెప్పారు.