AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజధానిపై ప్రజల అభిప్రాయం..జగన్ ఆర్డర్ అదుర్స్..!

సీఎం జగన్..ఇఫ్పుడు దేశంలో ఓ సెన్సేషన్‌గా మారారు. అనూహ్య నిర్ణయాలు, అంచనాలు వేయలేని రాజకీయ అడుగులతో దూసుకుపోతున్నారు. ఖజానాలో నిధలు లేకున్నా..సంక్షేమ కార్యక్రమాల విషయంలో వెనక్కి తగ్గకుండా తన పార్క్ పాలన ఏంటో చూపిస్తున్నారు. ఏపీని ఇప్పుడు పరిపాలించడం కత్తి మీద సామే. ఎందుకంటే ఎదురుగా రాజధాని నిర్మాణం ఉంది. అనేక ఆర్థికపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. అటువంటి సరిస్థితుల్లో సీఎం జగన్ పాలన చూసి ఇతడు మొదటి టర్మ్ సీఎం అంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. […]

రాజధానిపై ప్రజల అభిప్రాయం..జగన్ ఆర్డర్ అదుర్స్..!
Ram Naramaneni
|

Updated on: Oct 28, 2019 | 8:12 PM

Share

సీఎం జగన్..ఇఫ్పుడు దేశంలో ఓ సెన్సేషన్‌గా మారారు. అనూహ్య నిర్ణయాలు, అంచనాలు వేయలేని రాజకీయ అడుగులతో దూసుకుపోతున్నారు. ఖజానాలో నిధలు లేకున్నా..సంక్షేమ కార్యక్రమాల విషయంలో వెనక్కి తగ్గకుండా తన పార్క్ పాలన ఏంటో చూపిస్తున్నారు. ఏపీని ఇప్పుడు పరిపాలించడం కత్తి మీద సామే. ఎందుకంటే ఎదురుగా రాజధాని నిర్మాణం ఉంది. అనేక ఆర్థికపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. అటువంటి సరిస్థితుల్లో సీఎం జగన్ పాలన చూసి ఇతడు మొదటి టర్మ్ సీఎం అంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. అంత సమర్థవంతంగా అతని అడుగులు పడుతున్నాయి.

ఇక ఏపీ రాజధాని విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిపుణుల కమిటీని రిపోర్ట్ తర్వాత రాజధానిపై ముందుకు వెళ్తామని..మున్సిపల్ మంత్రి బొత్స ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కమిటీకి కూడా ఇప్పుడు గ్రౌండ్ లెవల్‌లో లోటుపాట్లను పూర్తిగా అంచనా వేస్తోంది. తాజాగా ఏపీ రాజధానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల నుంచి అభిప్రాయ సేకరణకు రంగం సిద్దమైంది. కొద్ది రోజుల క్రితమే ఈ కమిటీ సమావేశంకాగా.. తాజాగా ప్రజాభిఫ్రాయ సేకరణ ప్రారంభించింది. రాజధాని నిర్మాణం సహా రాష్ట్రంలోని ప్రాజెక్టులపై అభిప్రాయాలు, సూచనలు పంపాలని కోరిన నిపుణుల కమిటీ కోరింది. ఈ మేరకు కొన్ని సూచనలు చేసింది.

రాజధానిపై అభిప్రాయాలు తెలియజేయాలనుకున్నవాళ్లు.. ఈ-మెయిల్ లేదా లేఖల ద్వారా పంపాలని జీఎన్ రావు కమిటీ కోరింది. అభిప్రాయాలను చెప్పదలచుకున్నవారు.. expertcommitee2019@gamail.com అడ్రస్‌కు మెయిల్ చేయొచ్చు. విజయవాడలోని నిపుణుల కమిటీ కార్యాలయానికి లేఖల్ని పోస్టులో పంపాలి. సూచనలు పంపించేందుకు నవంబర్ 12 వరకు గడువుగా నిర్ణయించారు.