AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur Boy Missing: బ్రేకింగ్ : గుంటూరు నగరంలో కురిసిన భారీ వర్షానికి డ్రైన్ లో కొట్టుకుపోయిన బాలుడి ఆచూకీ లభ్యం

నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరంలోని డ్రెయిన్లు పొంగిపొర్లాయి. ఈ వర్ష బీభత్సానికి పీకల వాగు కూడా పొంగిపొర్లింది. ఈ క్రమంలో శివరాం నగర్ లో నివసించే..

Guntur Boy Missing:  బ్రేకింగ్ : గుంటూరు నగరంలో కురిసిన భారీ వర్షానికి డ్రైన్ లో కొట్టుకుపోయిన బాలుడి ఆచూకీ లభ్యం
Boy Swept Away
Venkata Narayana
|

Updated on: Jun 27, 2021 | 10:08 AM

Share

Guntur : గుంటూరు నగరంలో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరంలోని డ్రెయిన్లు పొంగిపొర్లాయి. ఈ వర్ష బీభత్సానికి పీకల వాగు కూడా పొంగిపొర్లింది. ఈ క్రమంలో శివరాం నగర్ లో నివసించే పుల్లయ్య, మంగమ్మల రెండో కొడుకు కాలువ ఒడ్డున ఆడుకుంటూ పీకలవాగు డ్రెయిన్ లో పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన వెంకటేష్ అన్నయ్య తల్లి దండ్రులకు చెప్పాడు.

అయితే, డ్రెయిన్ వేగంగా ప్రవహిస్తుండటంతో అప్పటికే బాలుడు డ్రైన్ లో కొట్టుకుపోయాడు. బాలుడి ఆచూకి కోసం ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం రంగంలోకి దిగి గాలింపు చేపట్టింది. నగర మేయర్ కావటి మనోహర్ గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటన నిన్న సాయంత్రం ఐదుగంటల సమయంలో జరిగినప్పటికీ ఇప్పటి వరకూ బాలుడు జాడ తెలియరాలేదు. మరోవైపు, బాలుడి తల్లిదండ్రులు చిన్నారి కోసం కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఇప్పుడే అందిన వార్త :

గుంటూరు పీకలవాగు లో గల్లంతైన బాలుడు ఆచూకి లభ్యమైంది. సంపత్ నగర్ సమీపంలో బాలుడు మృత దేహం కనిపించింది. గత రాత్రి మెడికల్ క్లబ్ వద్ద పీకలవాగు లో పడి ఐదేళ్ల బాలుడు వెంకటేష్ గల్లంతైన సంగతి తెలిసిందే. ఎన్డిఆర్ఎఫ్ , మున్సిపల్ సిబ్బంది తో రాత్రంతా గాలింపు చేపట్టగా ఈ ఉదయం బాలుడు వెంకటేష్ శవమై కనిపించాడు.

కామారెడ్డి జిల్లాలో విషాదం.. మంజీరా నదిలో నలుగురు గల్లంతు.. ముగ్గురు మృతి

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బీర్కురులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందగా.. మరొకరు గల్లంతయ్యారు. నీటిలో మునిగిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. మృతులంతా బిచ్కుంద మండలం చెట్లూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మంజీర పరీవాహక ప్రాంతంలోని చౌడమ్మ గుంత దాటుతుండగా.. శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

మృతులు బీర్కూర్ నుంచి బిచ్కుంద మండటంతోని చెట్లూరు వెళ్తూ.. మంజీరా నది దాటుతుండగా.. ఈ ప్రమాదం జరిగింది. నీటి ప్రవాహం అధికంగా ఉండటం, దీంతోపాటు గుంతలు ఉండటంతో వారు నీటిలో మునిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరూ మూడు మృత దేహాలు మాత్రమే లభ్యమయ్యాయి.

Read also : YS Sharmila : మహానేతను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా సహించేదిలేదు.. ఖబడ్దార్ : వైయస్ షర్మిల

మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో