AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యారంగంలో సమూల మార్పు కోసం…

ప్రభుత్వ బడులను బాగుచేయడాన్ని సవాల్‌గా తీసుకున్నామని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌తో పాటు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. విద్యా ప్రమాణాల పెంపుతో పాటు విద్యాశాఖలో అమలు చేయాలనుకుంటున్న నూతన విధానాలపై సీఎం వారితో చర్చించారు. విద్యారంగంలో మార్పులపై కమిటీకి తన అభిప్రాయాలు చెప్పారు. సుధా నారాయణమూర్తి, బాలకృష్ణన్ లతో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ ప్రతి 15 రోజులకొకసారి ప్రభుత్వంతో భేటీ అవుతుంది. ప్రతి విద్యార్థికీ మూడు జతల […]

విద్యారంగంలో సమూల మార్పు కోసం...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 05, 2019 | 9:36 PM

Share

ప్రభుత్వ బడులను బాగుచేయడాన్ని సవాల్‌గా తీసుకున్నామని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌తో పాటు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. విద్యా ప్రమాణాల పెంపుతో పాటు విద్యాశాఖలో అమలు చేయాలనుకుంటున్న నూతన విధానాలపై సీఎం వారితో చర్చించారు. విద్యారంగంలో మార్పులపై కమిటీకి తన అభిప్రాయాలు చెప్పారు. సుధా నారాయణమూర్తి, బాలకృష్ణన్ లతో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ ప్రతి 15 రోజులకొకసారి ప్రభుత్వంతో భేటీ అవుతుంది.

ప్రతి విద్యార్థికీ మూడు జతల ఏకరూప దుస్తులు అందజేస్తామని.. విద్యార్థులు షూలు, సాక్సులు కొనేందుకు డబ్బులు కూడా ఇస్తామని జగన్‌ చెప్పారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పట్టణ ప్రాంతాల్లో అక్షయపాత్ర సంస్థకు, గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలకు అప్పగిస్తామని అన్నారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. బోర్డింగ్‌, లాడ్జింగ్‌ కోసం ప్రతి విద్యార్థికీ ఏటా రూ.20వేలు ఇస్తామన్నారు. డిగ్రీ పట్టా తీసుకున్నాక ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండాలని.. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇస్తామని చెప్పారు.