AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్‌.. ఇక‌పై రూ.2,500..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత నుంచి వైఎస్ జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. అందులో భాగంగానే వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చారు. ఇక ప్ర‌స్తుతం క‌రోనా కాలంలో కూడా 10 ల‌క్ష‌ల కోవిడ్ టెస్టులు చేసి రికార్డు...

ఏపీ పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్‌.. ఇక‌పై రూ.2,500..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 10, 2020 | 5:24 PM

Share

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత నుంచి వైఎస్ జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. అందులో భాగంగానే వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చారు. ఇక ప్ర‌స్తుతం క‌రోనా కాలంలో కూడా 10 ల‌క్ష‌ల కోవిడ్ టెస్టులు చేసి రికార్డు నెల‌కొల్పారు. ఇప్పుడు అందులో భాగంగానే ఏపీలోని పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి వారికి ఇచ్చే పెన్ష‌న్ మొత్తం పెర‌గ‌నుంది.

ప్ర‌స్తుతం పెన్ష‌న్ దారుల‌కు నెల‌కు రూ.2,250 పింఛ‌ను వ‌స్తుంది. వ‌చ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయ‌లు అంద‌నుంది. వృద్ధులు, వితంతులు, ఒంటరి మ‌హిళ‌ల‌కు ఈ పెన్ష‌న్‌ని గ్రామ‌, వార్డు వాలంటీర్లు అంద‌జేస్తారు. తాము అధికారంలోకి వ‌స్తే పింఛ‌ను సొమ్మును ఏడాదికి రూ.250 చొప్పున పెంచుకుంటూ వెళ్తామ‌ని.. వైఎస్ జ‌గ‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ ప్ర‌కారం జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేపట్టి ఏడాది పూర్త‌యింది. ఈ క్ర‌మంలో ఆగ‌ష్టు నుంచి పెన్ష‌న్ మొత్తం పెంచుతున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

కాగా  ఈ నెల 15న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఆ రోజున ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయం ఒకటో బ్లాక్​లో మంత్రి మండ‌లి భేటీ జరగనుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలు, క‌రోనా‌ నియంత్రణ చర్యలపై స‌హా పలు అంశాలపై చర్చించి మంత్రి వ‌ర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలను రెడీ చేయాలని సంబంధిత అధికారుల‌కు సీఎస్ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. జూలై 13 సాయంత్రం 5 గంటలలోపు ప్రతిపాదనలు సిద్ధంగా ఉండాల‌ని సూచించారు.

Read More:

ఎమ్మెల్యే రోజా గ‌న్‌మెన్‌కి క‌రోనా పాజిటివ్‌..

చైనా బ్రాండ్ ఫోన్ ప్ర‌చారానికి గుడ్ బై చెప్పిన యంగ్ హీరో..?

డ్వాక్రా మ‌హిళ‌ల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ శుభ‌వార్త‌..

దోసకాయ అమృతమే.. కానీ అతిగా తింటే ఈ వింత సమస్యలు తప్పవు!
దోసకాయ అమృతమే.. కానీ అతిగా తింటే ఈ వింత సమస్యలు తప్పవు!
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
మహిళలకు భారీ షాక్‌..రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు
మహిళలకు భారీ షాక్‌..రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు
లైవ్ వాయిస్ ట్రాన్సలేషన్.. ఇలా సెట్ చేసుకుంటే మీకు నో ప్రాబ్లం
లైవ్ వాయిస్ ట్రాన్సలేషన్.. ఇలా సెట్ చేసుకుంటే మీకు నో ప్రాబ్లం
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
ఉక్రెయిన్ బందీ నుంచి విడిపించండి.. గుజరాత్ విద్యార్థి వేడుకోలు!
ఉక్రెయిన్ బందీ నుంచి విడిపించండి.. గుజరాత్ విద్యార్థి వేడుకోలు!
మీరు గోల్డ్‌ లోన్‌ తీసుకుంటున్నారా? రూల్స్‌ మరింత కఠినం!
మీరు గోల్డ్‌ లోన్‌ తీసుకుంటున్నారా? రూల్స్‌ మరింత కఠినం!
కేకేఆర్ పెట్టిన ప్రతి పైసాకు న్యాయం చేసిన ముస్తఫిజుర్
కేకేఆర్ పెట్టిన ప్రతి పైసాకు న్యాయం చేసిన ముస్తఫిజుర్
సవాళ్లు స్వీకరించడం ఇష్టమంటున్న టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ
సవాళ్లు స్వీకరించడం ఇష్టమంటున్న టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ
ఫస్ట్ పార్ట్‌తోనే టెన్షన్ పెట్టేశారు.. సీక్వెల్‌ ప్లాన్ ఏంటో మరి?
ఫస్ట్ పార్ట్‌తోనే టెన్షన్ పెట్టేశారు.. సీక్వెల్‌ ప్లాన్ ఏంటో మరి?