Delhi: కేంద్ర హోమంత్రి అమిత్షాతో సీఎం జగన్ భేటీ.. ఆ రెండు అంశాలపై దృష్టిపెట్టాలని ఒత్తిడి..!
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్.. అక్కడ బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయిన ఆయన.. సమస్యల చిట్టా విప్పారు. విభజన జరిగి తొమ్మిదేళ్లయ్యిందని, సమస్యలను ఇంకెప్పుడు పరిష్కరిస్తారంటూ అడిగారు. ప్రధానంగా 13 అంశాలను అమిత్షా దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్.. అక్కడ బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయిన ఆయన.. సమస్యల చిట్టా విప్పారు. విభజన జరిగి తొమ్మిదేళ్లయ్యిందని, సమస్యలను ఇంకెప్పుడు పరిష్కరిస్తారంటూ అడిగారు. ప్రధానంగా 13 అంశాలను అమిత్షా దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్. అందులో రెండింటిని మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ రెండింటిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ అమిత్షాకి విజ్ఞప్తి చేశారు. ఇంతకీ ఆ రెండూ ఏంటి?. వాటిపై ఎందుకంత జగన్ ఒత్తిడి చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.
సీఎం జగన్ ప్రధానంశాలుగా పేర్కొన్నవి పోలవరం, విభజన సమస్యలు. ఈ రెండే మెయిన్ అజెండాగా కేంద్ర హోంమంత్రి అమిత్షాతో చర్చలు జరిపారు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి. ప్రధానంగా 13 అంశాలను షా దృష్టికి తీసుకెళ్లినా.. పోలవరం, విభజన ఇష్యూస్ను నొక్కిచెప్పారు. పోలవరం నిధులను వెంటనే ఇవ్వాలని కోరారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న వ్యయాన్ని ఎప్పటికప్పుడు రిలీజ్ చేయాలని విజ్ఞప్తిచేశారు. అలాగే, పోలవరం రివైజ్డ్ ఎస్టిమేట్స్కి ఆమోదం తెలపాలని, ఆర్అండ్ఆర్ పునరావాస ప్యాకేజీపై నిర్ణయం తీసుకోవాలని మెమొరాండం అందజేశారు. ఇందులో ప్రధానంగా పోలవరం నిర్మాణం కోసం అడహక్గా రూ. 10 వేల కోట్లు, డయాఫ్రమ్వాల్ మరమ్మతు కోసం రూ. 2 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 2,600 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలన్నారు. అలాగే, సవరించిన రూ.55,548 కోట్ల పోలవరం అంచనాలను ఆమోదించాలని అమిత్షాను కోరారు.
పోలవరం తర్వాత ప్రధానంగా విభజన సమస్యలు, హామీలను అమిత్షా దృష్టికి తీసుకెళ్లారు జగన్. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ హామీల అమలు జరగలేదని గుర్తుచేశారు. విభజన సమస్యలను పరిష్కరించడంతోపాటు ప్రత్యేక హోదా లాంటి హామీలను నెరవేర్చాలని కోరారు. పోలవరం, విభజన సమస్యల తర్వాత రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై అమిత్షాకి మెమొరాండం ఇచ్చారు. రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద ఏపీకి రావాల్సిన రూ. 36,625కోట్లను వెంటనే ఇప్పించాలని కోరారు.
FRBM సీలింగ్ను సవరించి, కొత్త రుణాలు తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. అలాగే, తెలంగాణ నుంచి రావాల్సిన రూ.7,058 కోట్ల విద్యుత్ బకాయిలను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు జగన్. ఆహార భద్రత లబ్దిదారుల ఎంపికలో ఏపీకి అన్యాయం జరుగుతోందన్న సీఎం జగన్.. రాష్ట్రానికి 77వేల టన్నుల రేషన్ కేటాయించాలని కోరారు. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే ఏపీపై రూ. 5,527 కోట్ల భారం తగ్గుతుందని అమిత్షా దృష్టికి తీసుకెళ్లారు.
ఇక, ఫైనల్గా కొత్తగా 12 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వడంతోపాటు ఆర్ధిక సాయం చేయాలన్నారు సీఎం జగన్. టోటల్గా అరగంటపాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. షెడ్యూల్ ప్రకారం బుధవారం రాత్రి 9గంటలకు మీటింగ్ జరగాల్సి ఉండగా, రెండు గంటలు ఆలస్యంగా భేటీ జరిగింది. ఈ సమావేశంలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..