AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నెల 15న ఏపీ కేబినెట్‌ భేటీ….

ఈ నెల 15న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఆ రోజున ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయం ఒకటో బ్లాక్​లో మంత్రి మండ‌లి భేటీ జరగనుంది.

ఈ నెల 15న  ఏపీ కేబినెట్‌ భేటీ....
Ram Naramaneni
|

Updated on: Jul 10, 2020 | 6:11 PM

Share

ఈ నెల 15న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఆ రోజున ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయం ఒకటో బ్లాక్​లో మంత్రి మండ‌లి భేటీ జరగనుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలు, క‌రోనా‌ నియంత్రణ చర్యలపై స‌హా పలు అంశాలపై చర్చించి మంత్రి వ‌ర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలను రెడీ చేయాలని సంబంధిత అధికారుల‌కు సీఎస్ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. జూలై 13 సాయంత్రం 5 గంటలలోపు ప్రతిపాదనలు సిద్ధంగా ఉండాల‌ని సూచించారు.

ఇక‌ గత నెల 11న జరిగిన కేబినెట్‌ భేటీలో ‘జగనన్న తోడు’, ‘వైఎస్సార్‌ చేయూత’, ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’, ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్’ స్కీముల‌కు కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ సంగతి తెలిసిందే. వీటితోపాటు గృహనిర్మాణాల మార్గదర్శకాల్లో మార్పులు.. చేర్పులకు, ఇళ్లపట్టాలు, శ్రీకాకుళం, మచిలీపట్నం, గుంటూరు గవ‌ర్న‌మెంట్ నర్సింగ్ క‌ళాశాల‌ల్లో 282 టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.