Chittoor: ప్రేమ పేరుతో నయవంచన! భార్య మెడలో తాళి తెంచి.. నడిరోడ్డుపై వదిలేసి పరార్

ప్రేమ పేరిట ఓ యువతి జీవితాన్ని నాశనం చేశాడో మృగాడు. ప్రేమించానన్నాడు.. పెళ్లాడతానన్నాడు.. కాదంటే చంపేస్తా.. నేనూ చచ్చిపోతానని బెదిరించి మారీ ఆమెను వేధించి మరీ వివాహం చేసుకున్నాడు. కట్టుకున్న భార్యను గుండెల్లో పెట్టుకుని చూసుకోవడానికి బదులు.. పెళ్లి జరిగిన రోజే తాళి తెంచి, నడి రోడ్డుపై అనాథలా వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో అర్ధరాత్రి నడిరోడ్డుపై ఎటెళ్లాలో తెలియక చివరకు పోలీసులను ఆశ్రయించింది..

Chittoor: ప్రేమ పేరుతో నయవంచన! భార్య మెడలో తాళి తెంచి.. నడిరోడ్డుపై వదిలేసి పరార్
Chittoor Crime
Follow us

|

Updated on: Mar 19, 2024 | 7:38 AM

చిత్తూరు, మార్చి 19: ప్రేమ పేరిట ఓ యువతి జీవితాన్ని నాశనం చేశాడో మృగాడు. ప్రేమించానన్నాడు.. పెళ్లాడతానన్నాడు.. కాదంటే చంపేస్తా.. నేనూ చచ్చిపోతానని బెదిరించి మారీ ఆమెను వేధించి మరీ వివాహం చేసుకున్నాడు. కట్టుకున్న భార్యను గుండెల్లో పెట్టుకుని చూసుకోవడానికి బదులు.. పెళ్లి జరిగిన రోజే తాళి తెంచి, నడి రోడ్డుపై అనాథలా వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో అర్ధరాత్రి నడిరోడ్డుపై ఎటెళ్లాలో తెలియక చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం పాలేరు పంచాయతీ మోతకుంటలో సోమవారం (మార్చి 18) వెలుగు చూసింది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం..

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం పాలేరు పంచాయతీ శేషాపురం గ్రామానికి చెందిన యమున (21) మోతకుంట గ్రామానికి చెందిన అభిరామ్‌(22) స్థానిక ప్రైవేటు డిగ్రీ కాలేజీలో చదువుకునేవారు. అయితే అభిరామ్‌ నిత్యం ప్రేమ పేరిట యమునను వేధించేవాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని, నిరాకరిస్తే చంపి, తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేవాడు. భయాందోళనలకు గురైన యమున అతడి ప్రేమను అంగీకరించింది. ఈ క్రమంలో మార్చి 6వ తేదీన తమిళనాడులోని అరుణాచలం దేవస్థానానికి కారులో వెళ్లి, అక్కడ పెళ్లి చేసుకుని వేకువజామున అభిరామ్‌ తన ఇంటికి తీసుకెళ్లాడు. తాము పెళ్లి చేసుకున్నామని తెల్పగానే.. అతడి తండ్రి శేఖర్‌, తల్లి నాగభూషణమ్మ, అన్నలు క్రిష్ణ, అనిల్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

తమకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకు యమునపై దాడికి పాల్పడ్డారు. ఆమె మెడలోని తాళి తెంచి, చంపుతామని బెదిరించి.. ఆమె వద్ద ఉన్న మొబైల్‌, రెండున్నర గ్రాముల బంగారు ఉంగరాన్ని లాక్కుని దాడి చేశారు. అనంతరం ఆమెను బైక్‌పై ఎక్కించుకుని శేషాపురం సర్వీసు రోడ్డులో వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఆమె ఈ నెల 7న మదనపల్లెలోని స్నేహితురాలు రెడ్డిరాణి వద్దకు చేరుకుని తన గోడు వెళ్లగక్కి రోధించింది. ఆమె వద్ద ఫోన్‌ తీసుకుని భర్త అభిరామ్‌కు ఫోన్‌ చేసి తనకు న్యాయం చేయాలని కోరింది. అయితే కొద్దికాలం ఆమెను అక్కడే ఉండాలని, త్వరలోనే ఇంటికి తీసుకెళ్తానని నమ్మబలికాడు. అతడి మాటలు గుడ్డిగా నమ్మిన యమున అప్పటి నుంచి భర్త రాకకోసం ఎదురుచూడసాగింది. ఈ క్రమంలో సోమవారం అతడికి ఫోన్‌ చేస్తే కట్‌ చేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యమున బంగారుపాళ్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లికార్జున తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం
గోధుమ రవ్వతో ఇలా ఇడ్లీలు చేయండి.. హెల్త్‌తో పాటు రుచి కూడా..
గోధుమ రవ్వతో ఇలా ఇడ్లీలు చేయండి.. హెల్త్‌తో పాటు రుచి కూడా..
రాగి పిండితో పునుగులు ఇలా చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం కూడా!
రాగి పిండితో పునుగులు ఇలా చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం కూడా!
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.