AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Underwater Cycling: సముద్ర గర్భంలో సైక్లింగ్.. ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసుండర్.. నెటిజన్లు ఫిదా!

సైకిలను సాధారణంగా ఎక్కడ తొక్కుతాం..? రోడ్ల పైనో, గట్ల పైన, లేదా కొండల్లో లోయల్లోనో కదా..? మరి సముద్రం అడుగు భాగంలో సైకిల్ తొక్కడం ఎప్పుడైనా చూశారా? పోనీ ఎక్కడైనా విన్నారా లేదు కదా.. కానీ విశాఖకు చెందిన స్కూబా డ్రైవర్లు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. సముధ్రం అడుగునా సైకిల్ తొక్కి అందరినీ ఆకట్టుకున్నారు. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం దీని గురించి పూర్తిగా తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jun 03, 2026 | 7:39 PM

Share
వరల్డ్ బైసికిల్ డే సందర్భంగా విశాఖలో అండర్‌ వాటర్ సైక్లింగ్ ఔరా అనిపించింది. సముద్ర గర్భంలో స్కూబా డైవర్ల అద్భుత ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. విశాఖకు చెందిన నలుగురు స్కూబా డైవర్ల బృందం మంగమారి పేట ఋషికొండ మధ్య సముద్ర జలాల్లో  ప్రదర్శన చేశారు.

వరల్డ్ బైసికిల్ డే సందర్భంగా విశాఖలో అండర్‌ వాటర్ సైక్లింగ్ ఔరా అనిపించింది. సముద్ర గర్భంలో స్కూబా డైవర్ల అద్భుత ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. విశాఖకు చెందిన నలుగురు స్కూబా డైవర్ల బృందం మంగమారి పేట ఋషికొండ మధ్య సముద్ర జలాల్లో ప్రదర్శన చేశారు.

1 / 5
ఏపీ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బలరాం నాయుడు నేతృత్వంలో అండర్ వాటర్ సైక్లింగ్ నిర్వహించ్చారు. సైక్లింగ్‌ను పర్యావరణ హితమైన, ఆరోగ్యకరమైన స్థిరమైన రవాణా సాధనమంటున్నరు స్కూబా డైవర్లు. ఫిట్‌నెస్, పర్యావరణ పరిరక్షణ,  స్థిరమైన రవాణా విధానాలను ప్రోత్సహించాలన్న భారత ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పిలుపును అందుకున్నారు.

ఏపీ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బలరాం నాయుడు నేతృత్వంలో అండర్ వాటర్ సైక్లింగ్ నిర్వహించ్చారు. సైక్లింగ్‌ను పర్యావరణ హితమైన, ఆరోగ్యకరమైన స్థిరమైన రవాణా సాధనమంటున్నరు స్కూబా డైవర్లు. ఫిట్‌నెస్, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన రవాణా విధానాలను ప్రోత్సహించాలన్న భారత ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పిలుపును అందుకున్నారు.

2 / 5
వరల్డ్ బైసికిల్ డే సందర్భంగా విశాఖలో ఆంధ్రప్రదేశ్ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, లైవ్‌ఇన్ అడ్వెంచర్స్ స్కూబా డైవింగ్ అకాడమీ వ్యవస్థాపకుడు బలరాం నాయుడు ఆధ్వర్యంలో సముద్ర జలాల్లో వినూత్న అండర్‌వాటర్ సైక్లింగ్ ప్రదర్శన నిర్వహించారు. బాలరాం నాయుడు నాయకత్వంలో నలుగురు స్కూబా డైవర్ల బృందం.. స్కూబా పరికరాలు ధరించి సముద్ర గర్భంలో సైక్లింగ్ చేశారు.

వరల్డ్ బైసికిల్ డే సందర్భంగా విశాఖలో ఆంధ్రప్రదేశ్ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, లైవ్‌ఇన్ అడ్వెంచర్స్ స్కూబా డైవింగ్ అకాడమీ వ్యవస్థాపకుడు బలరాం నాయుడు ఆధ్వర్యంలో సముద్ర జలాల్లో వినూత్న అండర్‌వాటర్ సైక్లింగ్ ప్రదర్శన నిర్వహించారు. బాలరాం నాయుడు నాయకత్వంలో నలుగురు స్కూబా డైవర్ల బృందం.. స్కూబా పరికరాలు ధరించి సముద్ర గర్భంలో సైక్లింగ్ చేశారు.

3 / 5
ఈ సైక్లింగ్‌ను పర్యావరణ హితమైన, ఆరోగ్యకరమైన, స్థిరమైన రవాణా సాధనంగా ప్రోత్సహించారు. గతంలో అనేక బైసికిల్ క్లబ్‌లు చురుకుగా పనిచేసేవని, ప్రస్తుతం వాటి కార్యకలాపాలు తగ్గిన నేపథ్యంలో వాటిని మరింత బలోపేతం చేసి యువతను సైక్లింగ్ వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ సైక్లింగ్‌ను పర్యావరణ హితమైన, ఆరోగ్యకరమైన, స్థిరమైన రవాణా సాధనంగా ప్రోత్సహించారు. గతంలో అనేక బైసికిల్ క్లబ్‌లు చురుకుగా పనిచేసేవని, ప్రస్తుతం వాటి కార్యకలాపాలు తగ్గిన నేపథ్యంలో వాటిని మరింత బలోపేతం చేసి యువతను సైక్లింగ్ వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

4 / 5
సైక్లింగ్ వల్ల ఇంధన పొదుపు జరుగుతుంది, కాలుష్యం తగ్గుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది. ఈ ప్రదర్శన ద్వారా ప్రజలు తమ రోజువారీ జీవితంలో సైక్లింగ్‌ను అలవాటు చేసుకోవాలని మేము ప్రోత్సహిస్తున్నాము అని అన్నారు బలరాం నాయుడు.

సైక్లింగ్ వల్ల ఇంధన పొదుపు జరుగుతుంది, కాలుష్యం తగ్గుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది. ఈ ప్రదర్శన ద్వారా ప్రజలు తమ రోజువారీ జీవితంలో సైక్లింగ్‌ను అలవాటు చేసుకోవాలని మేము ప్రోత్సహిస్తున్నాము అని అన్నారు బలరాం నాయుడు.

5 / 5
Follow Us