Joe Biden: ఒడిశా రైలు ప్రమాదంపై అమెరికా ప్రెసిడెంట్ బైడెన్‌ దిగ్భ్రాంతి.. ‘నా హృదయం ముక్కలైంది’ అంటూ..

US President Joe Biden: ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్వార్తను వినగానే తన మనసు చలించిపోయిందని, ప్రమాదంలో చనిపోయినవారి కోసం యావత్..

Joe Biden: ఒడిశా రైలు ప్రమాదంపై అమెరికా ప్రెసిడెంట్ బైడెన్‌ దిగ్భ్రాంతి.. ‘నా హృదయం ముక్కలైంది’ అంటూ..
Joe Biden On Odisha Train Accident
Follow us

|

Updated on: Jun 04, 2023 | 12:22 PM

US President Joe Biden: ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్వార్తను వినగానే తన మనసు చలించిపోయిందని, ప్రమాదంలో చనిపోయినవారి కోసం యావత్ అమెరికా సమాజం సంతాపం తెలియజేస్తోందన్నారు. ఈ సందర్భంగా మరణించినవారి కుటుంబాలకు తన దేశం తరఫున సానుభూతి తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

‘భారత్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి విని నా హృదయం ముక్కలైంది. జిల్‌ బైడెన్‌, నేను తీవ్ర దిగ్భ్రాంతి చెందాము. ఈ దుర్ఘటన కారణంగా కుటుంబ సభ్యులను కోల్పోయినవారికి, గాయపడినవవారి కోసం ప్రార్థిస్తున్నాం. భారత్‌, అమెరికా మధ్య ఉన్న కుటుంబ, సాంస్కృతిక విలువల్లో ఉన్న మూలాలే ఇరు దేశాలను ఏకం చేస్తున్నాయి. బాధితుల కోసం యావత్ అమెరికా సంతాపం వ్యక్తం చేస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నవేళ మా ఆలోచనలన్నీ బాధితుల కుటుంబాలపైనే ఉన్నాయి’ అంటూ బైడెన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఒడిశా రైలు ప్రమాదంలో ఇప్పటిలెక్కల ప్రకారం 288 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రైలు ప్రమాదంపై అంతర్జాతీయ స్థాయి నాయకులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా, ఐరాస జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు కోరోసి సహా పలు దేశాల అధినేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డెయిరీ ఫామ్‌తో డైలీ ఆదాయం
డెయిరీ ఫామ్‌తో డైలీ ఆదాయం
సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..