Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా టైమ్.. ఆసుపత్రికి అజిత్‌ దంపతులు.. టెన్షన్‌లో ఫ్యాన్స్..!

కరోనా సృష్టిస్తోన్న విలయతాండవం నేపథ్యంలో అందరిలో టెన్షన్‌ పెరుగుతోంది. తమ ఆప్తులకు ఏమీ కాకూడదంటూ అందరూ తమ ఇష్టదైవాలను కోరుకుంటున్నారు.

కరోనా టైమ్.. ఆసుపత్రికి అజిత్‌ దంపతులు.. టెన్షన్‌లో ఫ్యాన్స్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 23, 2020 | 5:07 PM

కరోనా సృష్టిస్తోన్న విలయతాండవం నేపథ్యంలో అందరిలో టెన్షన్‌ పెరుగుతోంది. తమ ఆప్తులకు ఏమీ కాకూడదంటూ అందరూ తమ ఇష్టదైవాలను కోరుకుంటున్నారు. ఈ క్రమంలో దూరంగా ఉంటున్న తమ వారికి రోజు ఫోన్లు చేస్తూ వారి యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. కాగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రముఖ నటుడు ‘తల’ అజిత్, ఆయన సతీమణి షాలిని ఆసుపత్రికి వెళ్లారు. మాస్క్‌లు ధరించిన ఆ ఇద్దరు చెన్నైలోని ఓ ఆసుపత్రికి వెళ్లగా.. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌లో టెన్షన్ మొదలైంది. తమ అభిమాన నటుడికి ఏమైందోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా కోలీవుడ్ వర్గాల సమచారం ప్రకారం గత కొన్ని రోజులుగా హీరో తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకోసమే అజిత్, షాలిని ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో అజిత్‌ రూ.1.25కోట్లను తమిళనాడు ప్రభుత్వం, ఫెఫ్సీకి విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అజిత్‌, వినోత్ దర్శకత్వంలో వలిమై చిత్రంలో నటించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన నెర్కోండ పార్వై(పింక్ రీమేక్‌) మంచి విజయం సాధించడంతో.. ఇప్పుడు వలిమైపై చాలా అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: ఆరు రోజుల కవలలకు కరోనా.. అక్కడ అతి పిన్న వయస్కులు వారే..!