ఉగాది రోజు బాలయ్య ఫ్యాన్స్కు దిమ్మతిరిగే సర్ప్రైజ్!
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369. ఇప్పుడీ చిత్రం ఏప్రిల్ 4న రీ రిలీజ్కు రెడీ అవుతోంది. 4కె వెర్షన్లో.. 5.1 డాల్బీ సౌండ్తో సరికొత్తగా థియేటర్లలోకి వస్తోంది. ఇక ఇదే విషయాన్ని రీసెంట్గా అనౌన్స్ చేసి నందమూరి అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన ప్రొడ్యూసర్ శివలంక కృష్ణ ప్రసాద్.. ఇప్పుడు మరో దిమ్మతిరిగే న్యూస్ చెప్పారు.
మార్చ్ 30 ఉగాది రోజున బాలయ్య ఆదిత్య 369 రీ- రిలీజ్ ఈవెంట్ ఉంటుందంటూ చెప్పేశారు.అంతేకాదు ఆదిత్య 369 రీ రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ తో సహా చిత్రంలోని నటీ నటులు, సాంకేతిక నిపుణులు పాల్గొననున్నారని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే తన సంతోషాన్ని పంచుకున్నారు. బాలకృష్ణ హీరోగా నటించిన ఆల్ టైమ్ కల్డ్ క్లాసిక్ సినిమా ఆదిత్య 369. ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా.. సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ జానర్ లో ఈ మూవీని తీశారు. ఇందులో మోహిని హీరోయిన్ గా నటించగా.. ఇళయరాజా మ్యూజిక్ అందించారు. 1991లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా కాసుల వర్షం కురిపించింది. అంతేకాకుండా రెండు నంది అవార్డులను సొంతం చేసుకుంది.
మరిన్ని వీడియోల కోసం :