AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెప్టెంబర్ 24.. ప్రపంచ నదుల దినోత్సవం.. చరిత్ర, ఈ యేడు థీమ్ ఏంటో తెలుసా..? ప్రాముఖ్యత ..!

గంగా భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ, పురాణ నదిగా పరిగణించబడుతుంది. గంగా నది హిందువులకు అత్యంత పవిత్రమైన నది. దీనిని దేవతగా పూజిస్తారు. గంగా నది హిమాలయాలలోని గంగోత్రిలో పుడుతుంది. గంగానదికి ఉన్నంత ప్రాముఖ్యతను, ఘనతను పొందిన నది ప్రపంచంలో మరొకటి లేదు. సింధు, గంగానదితో పాటు, గోదావరి నది భారతదేశంలో అత్యంత ముఖ్యమైన నది. గంగానది తర్వాత ఇది రెండవ అతిపెద్ద నది.

సెప్టెంబర్ 24.. ప్రపంచ నదుల దినోత్సవం.. చరిత్ర, ఈ యేడు థీమ్ ఏంటో తెలుసా..?  ప్రాముఖ్యత ..!
World River Day
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 23, 2023 | 3:28 PM

భారతదేశాన్ని నదుల భూమిగా పిలుస్తారు. భారతదేశంలో అనేక నదులు ఉద్భవించి ప్రవహిస్తున్నాయి. భారతదేశంలో ప్రధాన, చిన్న నదులతో సహా దాదాపు 200 ప్రధాన నదులు ఉన్నాయి. అలాంటి నదులను మన దేశంలో పవిత్రంగా భావిస్తారు. నదులకు దేవతా హోదా ఇస్తారు. వారిని అమ్మవారిగా పూజిస్తారు. అయితే, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నాలుగో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా రివర్ డే గా జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24న అంతర్జాతీయ నదుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నదుల హక్కు అనేది ఈ ఏడాది థీమ్. నదులను జాతీయ ఆస్తులుగా ప్రకటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2005లో మొదటిసారిగా ప్రపంచ నదీ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నదులను రక్షించే లక్ష్యంతో ఈ వేడుకను ప్రారంభించారు. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ నదుల దినోత్సవం భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక నదులు ఉన్నాయి. ప్రతి నదికి దాని స్థల పురాణానికి సంబంధించి అద్భుతమైన కథ ఉంటుంది. దేశమంతటా ప్రవహించే నదులు వాటి వైభవాన్ని, అందాన్ని చాటిచెబుతున్నాయి.

హిందూ మతంలో యుమున, బ్రహ్మపుత్ర, సింధు, గోదావరి, నర్మద, కృష్ణ, మహానది, తపతి, వివస్త, సరస్వతి, కుంభ, కావేరి, శరావతి వంటి నదులను అత్యంత పవిత్ర నదులుగా గొప్పగా పరిగణిస్తారు. నదిలో స్నానం చేయడం, పూజించడం పవిత్రంగా భావిస్తారు. పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల మనస్సు, శరీరం రెండూ శుభ్రమవుతాయని భావిస్తారు. . సకల పాపాలు పోగొట్టుకోవడానికి నదిలో స్నానం చేయాలని నమ్ముతారు. నదీస్నానం చేస్తే ఆరోగ్యం మెరుగవుతుందనే బలమైన విశ్వాసం కూడా ఉంది. నది ఉన్నా లేకపోయినా గంగా, యమున, సింధు, గోదావరి, నర్మద, కృష్ణా, కావేరీ అనే సప్త నదులను ఇంట్లో స్నానం చేసేటపుడు స్మరించుకుంటారు. ఈ నామాలను పఠించి స్నానం చేస్తే పుణ్యం కలుగుతుందని నమ్ముతారు. పాపం నాశనం అవుతుంది. గంగా నదికి ప్రత్యేక స్థానం ఇస్తారు. గంగా పూజ, గంగాస్నానం అన్నీ పవిత్రమైనవి.

హిమాలయ కొండల్లో ప్రవహించే సింధు నది నుండి మన నాగరికత ప్రారంభమైంది. భారతదేశం చారిత్రక విలువలు సింధు నదితో ముడిపడి ఉన్నప్పటికీ, గంగా భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ, పురాణ నదిగా పరిగణించబడుతుంది. గంగా నది హిందువులకు అత్యంత పవిత్రమైన నది. దీనిని దేవతగా పూజిస్తారు. గంగా నది హిమాలయాలలోని గంగోత్రిలో పుడుతుంది. గంగానదికి ఉన్నంత ప్రాముఖ్యతను, ఘనతను పొందిన నది ప్రపంచంలో మరొకటి లేదు. సింధు, గంగానదితో పాటు, గోదావరి నది భారతదేశంలో అత్యంత ముఖ్యమైన నది. గంగానది తర్వాత ఇది రెండవ అతిపెద్ద నది. హిందూ గ్రంధాలలో గోదావరి నదిని పవిత్ర నదిగా పరిగణిస్తారు. గోదావరి నది అనేక శతాబ్దాలుగా గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించింది. భారతదేశంలోని ప్రతి నది లక్షలాది ప్రజల జీవనాధారంగా నిలుస్తుంది.

ఇవి కూడా చదవండి