‘సాయానికి సిధ్దం, మా కోసం ఇండియా, వారి కోసం మేం,’ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్,
భారత దేశంలో కోవిడ్ పరిస్థితి పై ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడిన అనంతరం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్..ఇండియా కోసం తాము ఉన్నామని, తమ కోసం ఇండియా ఉందని వ్యాఖ్యానించారు.
భారత దేశంలో కోవిడ్ పరిస్థితి పై ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడిన అనంతరం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్..ఇండియా కోసం తాము ఉన్నామని, తమ కోసం ఇండియా ఉందని వ్యాఖ్యానించారు. నేడు తాను మోదీతో మాట్లాడానని, మా దేశం అత్యవసర సాయం అందిస్తుందని హామీ ఇచ్చానని ట్వీట్ చేశారు. అమెరికా 46 వ అధ్యక్షునిగా గత జనవరి 20 న ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయనను మోదీ ఫోన్ ద్వారా అభినందించారు. మళ్ళీ ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకోవడం ఇది రెండో సారి. వీరి మధ్య సంభాషణ సుమారు 45 నిముషాల కొనసాగింది. ఈ సంక్షోభ సమయంలో ఇండియాకు అవసరమైన సాయమంతా చేస్తామని బైడెన్ హామీ ఇచ్చినట్టు వైట్ హౌస్ తెలిపింది. భారత అభ్యర్థనపై అమెరికా ఆక్సిజన్, మందులు, ఇతర వైద్య పరికరాలను అంజేస్తుందని ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి తెలిపారు. ఆక్సిజన్ జనరేషన్ సిస్టంలను ప్రొవైడ్ చేసే అవకాశాలను రక్షణ శాఖ పరిశీలిస్తోందని ఆమె చెప్పారు.ఫీల్డ్ ఆక్సిజన్ జనరేషన్ సిస్టమ్స్ ని తాము ఫీల్డ్ మెడికల్ హాస్పిటల్స్ లో వినియోగిస్తున్నామని, వీటిని ఇండియాకు పంపుతామని ఆమె చెప్పారు. వీటిలో ప్రతి యూనిట్ 50 నుంచి 100 బెడ్స్ కి ఆక్సిజన్ సప్లయ్ చేయగలదన్నారు. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను, వెంటిలేటర్లను కూడా అమెరికా పంపనుంది.
గత ఏడాది ఇండియాకు యూఎస్ 200 వెంటిలేటర్ల, శిక్షణ పొందిన వైద్య సిబ్బందిని పపంపింది. అత్యవసర ప్రాతిపదికపై ఏడు వస్తువులను పంపాలంటూ ఇండియా జాబితా సమర్పించిందని, వాటిని వెంటనే పంపుతున్నామని ఆమె తెలిపారు. భారత అధికారులతో తమ అధికారులు నిరంతరం టచ్ లో ఉంటున్నారన్నారు. ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తికోసం ముడి పదార్థాలను పంపుతున్నామని ఆమె చెప్పారు. ఇప్పటివరకు వీటి ఎగుమతిపై బ్యాన్ ఉంటున్న విషయం గమనార్హం. అయితే దీన్ని అమెరికా ఎత్తివేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Covid 19: భారత్లో ఆందోళన కలిస్తోన్న కరోనా.. రూపం మార్చుకుంటున్న మహమ్మారి.. పెరుగుతున్న మరణాలు.. దేనికి సంకేతం?
Watch Video: ఆసుపత్రిలో రగడ.. పోలీసుల ముందే కొట్టుకున్న నర్సు, డాక్టర్.. వీడియో వైరల్..