భారత్, పాక్ దాడులను ఆపేయాలి.. విభేదాలు పరిష్కరించుకోవడానికి సహకరిస్తాః ట్రంప్
భారతదేశం-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరు దేశాలకు తాను ఏ విధంగానైనా సహాయం చేయగలిగితే తప్పకుండా సహాయం చేస్తానని అన్నారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న సంఘర్షణను ఆపాలని కోరుకుంటున్నానని అన్నారు. భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ అది భయంకరమైనదని అన్నారు.

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరు దేశాలకు తాను ఏ విధంగానైనా సహాయం చేయగలిగితే తప్పకుండా సహాయం చేస్తానని అన్నారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న సంఘర్షణను ఆపాలని కోరుకుంటున్నానని అన్నారు. భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ అది భయంకరమైనదని అన్నారు. రెండు దేశాలతో కలిసి పనిచేయాలనుకుంటున్నానని ట్రంప్ స్పష్టం చేశారు.
నాకు భారతదేశం, పాకిస్తాన్ రెండూ బాగా తెలుసునని, వారు ఉద్రిక్తతకు ముగింపు పలకాలని కోరుకుంటున్నానని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వాళ్ళు ఆపాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆపగలరని ఆశిస్తున్నానన్నారు. ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు. రెండు దేశాలతో మంచి సంబంధం ఉందని, ఈ ఉద్రిక్తతలు ఆగిపోవాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. రెండు దేశాలకు ఏ విధంగానైనా సహాయం చేయగలిగితే, నేను ఖచ్చితంగా చేస్తానని ట్రంప్ తెలిపారు. అంతకుముందు, ట్రంప్ మాట్లాడుతూ, ఈ శత్రుత్వం అతి త్వరలో ముగిసిపోతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.
మంగళవారం (మే 6, 2025) డొనాల్డ్ ట్రంప్ భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై స్పందిస్తూ, శత్రుత్వం అతి త్వరలో ముగిసిపోతుందని ఆశిస్తున్నట్లు అన్నారు. “ఇది సిగ్గుచేటు” అన్నాడు. “మేము ఓవల్ తలుపులో నడుస్తున్నప్పుడు దాని గురించి విన్నాము. గతంలోని కొంత భాగాన్ని బట్టి, ఏదో జరగబోతోందని ప్రజలకు తెలుసని నేను భావిస్తున్నాను” అని ఆయన అన్నారు. “వారు చాలా కాలంగా పోరాడుతున్నారు. నిజంగా, దాని గురించి ఆలోచిస్తే, వారు దశాబ్దాలుగా, శతాబ్దాలుగా పోరాడుతున్నారు” అని ట్రంప్ అన్నారు. రెండు దేశాలకు ఏదైనా సందేశం ఉందా అని అడిగినప్పుడు, “లేదు, ఇది త్వరలోనే ముగుస్తుందని ఆశిస్తున్నాను” అని ఆయన అన్నారు.
#WATCH | #OperationSindoor | US President Donald Trump spoke on Indian strikes inside Pakistan.
US President Donald Trump says "It is so terrible. I get along with both. I know both very well. I want to see them work it out, I want to see them stop. Hopefully, they can stop now.… pic.twitter.com/sRsG3fVmjc
— ANI (@ANI) May 7, 2025
ఇదిలా ఉండగా, పంజాబ్ ప్రావిన్స్, పీఓకేలోని నగరాలపై మంగళవారం(మే 07) అర్ధరాత్రి తర్వాత నియంత్రణ రేఖ వెంబడి జరిగిన క్షిపణి దాడులు, కాల్పుల్లో 31 మంది మరణించారని, 57 మంది గాయపడ్డారని పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ధృవీకరించారు.
Toll rises to 31 dead, 46 injured in Indian strikes on Pakistan, reports Reuters, citing Pakistan Army Spokesman.
— ANI (@ANI) May 7, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..