AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సౌదీ వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. గాయపడ్డ 10 మంది అమెరికా సైనికులు.. పలువురు సీరియస్!

పశ్చిమ ఆసియాలో యుద్ధానికి ట్రంప్ బ్రేక్ ప్రకటించినప్పటికీ.. మరోవైపు తీవ్రరూపం దాల్చుతోంది. శుక్రవారం (మార్చి 27) సౌదీ అరేబియాలోని ఒక సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 10 మంది అమెరికన్ సైనికులు గాయపడటంతో పాటు పలు విమానాలు దెబ్బతిన్నాయని అమెరికా అధికారులు తెలిపారు. గాయపడిన సైనికులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు.

సౌదీ వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. గాయపడ్డ 10 మంది అమెరికా సైనికులు.. పలువురు సీరియస్!
Iran Launches Missile Attack On Saudi Air Base. (representative Image)
Balaraju Goud
|

Updated on: Mar 28, 2026 | 8:07 AM

Share

పశ్చిమ ఆసియాలో యుద్ధానికి ట్రంప్ బ్రేక్ ప్రకటించినప్పటికీ.. మరోవైపు తీవ్రరూపం దాల్చుతోంది. శుక్రవారం (మార్చి 27) సౌదీ అరేబియాలోని ఒక సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 10 మంది అమెరికన్ సైనికులు గాయపడటంతో పాటు పలు విమానాలు దెబ్బతిన్నాయని అమెరికా అధికారులు తెలిపారు. గాయపడిన సైనికులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. సున్నితమైన సైనిక విషయాలపై చర్చించేందుకు సైనిక అధికారులు తమ పేర్లు వెల్లడించకుండా మాట్లాడారు.

ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌పై జరిగిన దాడిలో అనేక అమెరికా ఇంధన సరఫరా విమానాలు దెబ్బతిన్నాయని, సున్నితమైన సైనిక విషయాలపై చర్చించడానికి తమ పేర్లు వెల్లడించని షరతుపై మాట్లాడిన అధికారులు తెలిపారు. ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులలో ఒకరు చెప్పారు. విమానానికి జరిగిన నష్టాన్ని చూపిస్తున్నట్లుగా కనిపించిన ఉపగ్రహ చిత్రాలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. ఇరాన్ క్షిపణితో పాటు మానవరహిత డ్రోన్‌లను ఉపయోగించి ఈ దాడి జరిగింది. ఇరాన్‌ను తుడిచిపెట్టేశామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన ఒక రోజు తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. “చరిత్రలో ఎన్నడూ ఒక దేశ సైన్యాన్ని ఇంత త్వరగా, ఇంత సమర్థవంతంగా నిర్వీర్యం చేయలేదు” అని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పిన తర్వాత దాడి జరిగింది.

కాగా, నెల రోజుల పాటు సాగిన ఈ ఘర్షణలో 300 మందికి పైగా సైనికులు గాయపడ్డారని యూఎస్ సెంట్రల్ కమాండ్ శుక్రవారం తెలిపింది. గాయపడిన వారిలో చాలామంది కోలుకుని తిరిగి విధుల్లో చేరగా, 30 మంది ఇంకా విధులకు దూరంగా ఉన్నారు. 10 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

ఇదిలావుంటే, ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ దాడి చేయడం ఇది మొదటిసారి కాదు. మార్చి 1న స్థావరంపై జరిగిన దాడిలో 26 ఏళ్ల ఆర్మీ సార్జెంట్ బెంజమిన్ ఎన్. పెన్నింగ్‌టన్ గాయపడి, కొన్ని రోజుల తర్వాత మరణించారు. ఈ యుద్ధంలో మరణించిన 13 మంది సైనికులలో ఆయన ఒకరు. ఈ దాడి గురించి ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ ఇంతకుముందే తమ కథనంలో పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us