AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం! ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించిన శ్రీలంక

శ్రీలంక ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీకి "మిత్ర విభూషణ" అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసింది. భారత్-శ్రీలంక సంబంధాలను బలోపేతం చేసినందుకు ఈ గౌరవం. ఇది మోదీకి లభించిన 22వ అంతర్జాతీయ పురస్కారం. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే ఈ పురస్కారాన్ని అందించారు. మోదీ ఈ గౌరవాన్ని 140 కోట్ల భారతీయులకు లభించిన గౌరవంగా భావించారు.

ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం! ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించిన శ్రీలంక
Pm Modi
SN Pasha
|

Updated on: Apr 05, 2025 | 1:42 PM

Share

భారత్‌-శ్రీలంక సంబంధాలను బలోపేతం కోసం చేసిన కృషికి గుర్తింపుగా, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిష్టాత్మక మిత్ర విభూషణ పురస్కారం ప్రకటించింది శ్రీలంక ప్రభుత్వం. ఇది ప్రధాని మోదీకి లభించిన 22వ అంతర్జాతీయ పురస్కారం. మిత్ర విభూషణ పురస్కారం అనేది దేశాధినేతలకు శ్రీలంక ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం. కొలంబోలో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. శ్రీలంకతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్న ప్రపంచ దేశాల నాయకులను గౌరవించడానికి ప్రత్యేకంగా ఈ అవార్డును రూపొందించారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం “శ్రీలంక మిత్ర విభూషణ” ప్రదానం చేయాలని నిర్ణయించిందని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రధాని మోదీ ఈ గౌరవానికి ఎంతో అర్హులని మేం దృఢంగా విశ్వసిస్తున్నాం” ” అని లంక అధ్యక్షుడు దిస్సనాయకే అన్నారు. కాగా పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ గౌరవం కేవలం వ్యక్తిగత గుర్తింపు కాదని, 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవమని అన్నారు. అలాగే పురస్కారం అందించిన శ్రీలంక అధ్యక్షుడికి, ప్రభుత్వానికి, శ్రీలంక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోదీ. రెండు పొరుగు దేశాల మధ్య దీర్ఘకాల సంబంధానికి, బలమైన స్నేహానికి ఈ గౌరవం నిదర్శనంగా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?