‘భారత్‌ తరపున క్షమాపణలు.. ఆ వ్యాఖ్యలు దేశ సంస్కృతిని ప్రతిబింబించవు’

మహమ్మద్‌ ప్రవక్తపై భాజపా మాజీ అధికార ప్రతినిధులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా ఖతార్‌ ఆదివారం ఇండియన్‌ ఎంబసీకి సమన్లు జారీ..

'భారత్‌ తరపున క్షమాపణలు.. ఆ వ్యాఖ్యలు దేశ సంస్కృతిని ప్రతిబింబించవు'
India Qatar
Follow us

|

Updated on: Jun 06, 2022 | 2:15 PM

Qatar summons Indian envoy: మహమ్మద్‌ ప్రవక్తపై భాజపా మాజీ అధికార ప్రతినిధులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఖతార్‌ ఆదివారం ఇండియన్‌ ఎంబసీకి సమన్లు జారీ చేసింది. ఐతే సదరు వ్యాఖ్యలు భారత ప్రభుత్వ అభిప్రాయాన్ని ప్రతిబింబించవని స్పష్టం చేస్తూ భారత రాయబారి ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ పరిణామంపై పశ్చిమాసియా దేశాలు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా దేశాలు ఈ విషయమై స్పందించాయి. ఖతార్‌ అధికారిక పర్యటనలో భాగంగా భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఆ దేశంలో అడుగిడిన కొన్ని గంటల వ్యవధిలోనే దోహా రాయబార కార్యలయం నుంచి భారత విదేశాంగ రాయబారి దీపక్ మిట్టల్‌కు నోట్‌ అందింది. భారత్‌లో అధికారంలో కొనసాగుతున్న పార్టీ ఈ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం విచారకరమని, వాటిని ఖండిస్తున్నట్లు నోట్‌లో పేర్కొంది.

”భిన్నత్వంలో ఏకత్వం సంస్కృతికి అనుగుణంగా భారత ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుంది. ఏ మతాన్ని కించపరచదు. ఒక వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన ఇద్దరు అధికారిక ప్రతినిధులలో ఒకరిని పార్టీ సస్పెండ్‌ చేయగా, మరొకరిని పార్టీనుంచి బహిష్కరించింది. ఈ విషయమై భారత ప్రభుత్వం తరపున క్షమాపణలు తెలుపుతున్నట్లు” భారత రాయబారి మిట్టల్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా ఇంధన, వాణిజ్యం, భద్రత వంటి కీలకమైన రంగాలలో భారత్‌- ఖతార్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తున్నాయి. ఖతార్‌లో 7,00,000కు పైగా భారత సంతతి పౌరులు నివసిస్తున్నారు. వీరిలో వైద్యం, ఇంజనీరింగ్, విద్య, ఫైనాన్స్, వ్యాపార రంగాల్లో బ్లూ కాలర్ కార్మికులు, నిపుణులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..