AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌పై సుంకాలు.. ట్రంప్ తీరుపై అమెరికా కాంగ్రెస్ సభ్యుల ఆగ్రహం..!

అమెరికా విదేశాంగ విధానంపై విచారణ సందర్భంగా కాంగ్రెస్ మహిళ సభ్యురాలు సిడ్నీ కామ్లేగర్-డోవ్ తీవ్రంగా తప్పుబట్టారు. ట్రంప్ నిర్ణయాలే భారతదేశాన్ని రష్యాకు దగ్గరగా తీసుకువెళుతోందన్నారు. ట్రంప్ భారతదేశం పట్ల అనుసరిస్తున్న విధానాలను 'మన ముక్కు మనం కోసుకోవడమే' అనే సామెతతోనే వర్ణించారు. ఆ ప్రభుత్వ ఒత్తిడి వ్యూహాలు భారత్-అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక విశ్వాసానికి, పరస్పర అవగాహనకు శాశ్వత నష్టాన్ని కలిగిస్తున్నాయని కమ్లాగర్-డోవ్ అన్నారు.

భారత్‌పై సుంకాలు.. ట్రంప్ తీరుపై అమెరికా కాంగ్రెస్ సభ్యుల ఆగ్రహం..!
Us Congresswoman Sydney Kamlager Dove
Balaraju Goud
|

Updated on: Dec 11, 2025 | 8:30 PM

Share

భారతదేశం పట్ల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపై సొంత దేశం సెనేటర్లే తప్పుబడుతున్నారు. భారత్‌తో వ్యూహాత్మక విశ్వాసం, పరస్పర అవగాహనకు నిజమైన, శాశ్వత నష్టాన్ని కలిగిస్తున్నాయని అమెరికా పార్లమెంటుసభ్యులు ఒకరు అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలకు జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి అమెరికా నమ్మశక్యం కాని అత్యవసర పరిస్థితిలో వ్యవహరించాలని అన్నారు.

కాలిఫోర్నియాకు చెందిన డెమోక్రటిక్ పార్టీ కాంగ్రెస్ సభ్యులు సిండీ కమ్లేగర్-డోవ్, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలపై మండిపడ్డారు “ట్రంప్ తన విధానాన్ని మార్చుకోకపోతే, అతను భారతదేశాన్ని కోల్పోయిన అమెరికన్ అధ్యక్షుడు అవుతాడు. రష్యన్ సామ్రాజ్యాన్ని శక్తివంతం చేస్తూ భారతదేశాన్ని దూరం చేసిన వ్యక్తి. అతను అట్లాంటిక్ కూటమిని విచ్ఛిన్నం చేశాడు. లాటిన్ అమెరికాను ప్రమాదంలో పడేశాడు. ఇది ఏ అధ్యక్షుడు గర్వించాల్సిన వారసత్వం కాదు.” అని అన్నారు.

“భారతదేశం పట్ల ట్రంప్ శత్రుత్వం ఎక్కడ మొదలైందో వివరించినప్పుడు, అవి మన దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలతో సంబంధం లేని విషయాన్ని సూచిస్తాయి. అది నోబెల్ శాంతి బహుమతి పట్ల ఆయనకున్న వ్యక్తిగత వ్యామోహం. ఇది హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ, దాని వల్ల కలిగే నష్టాన్ని తేలికగా తీసుకోలేము” అని ఆయన అన్నారు.

మే నెలలో భారతదేశం-పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఘర్షణలను ముగించినందున నోబెల్ శాంతి బహుమతిని అందుకోవాలని ట్రంప్ ఆశపడ్డారు. కాగా, దక్షిణ – మధ్య ఆసియాపై విదేశీ వ్యవహారాలపై కాంగ్రెస్ సబ్‌కమిటీని ఉద్దేశించి కమలాగర్-డోవ్ “యుఎస్-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యం: స్వేచ్ఛాయుతమైన, బహిరంగ ఇండో-పసిఫిక్‌ను భద్రపరచడం” అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

భారతదేశం పట్ల ట్రంప్ విధానాలను కమలాగర్-డోవ్ తీవ్రంగా విమర్శించారు. ఈ విధానాలలో ప్రపంచంలోనే అత్యధికంగా 50 శాతం సుంకం విధించడం, H-1B వీసాలపై US$100,000 రుసుము విధించడం అన్యాయమన్నారు. అమెరికాలో నివసించడానికి, పని చేయడానికి పెద్ద సంఖ్యలో భారతీయులు H-1B వీసాలను ఉపయోగిస్తున్నారు. ట్రంప్ విధానాలు నిజమైన, శాశ్వత హాని కలిగిస్తున్నాయని, ఈ హానిని అత్యవసర పరిస్థితితో తగ్గించడానికి ట్రంప్ తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కమలాగర్-డోవ్ అన్నారు.

వీడియో ఇక్కడ చూడండి.. 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..