AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ వల్లే.. శ్రీలంక క్రికెటర్లు పాక్ రావడం లేదు.. పాక్ మంత్రి

పాక్ మంత్రి మరోసారి భారత్‌పై నోరుపారేసుకున్నారు. ఇంతకు ముందు చంద్రయాన్‌ 2 ప్రయోగం సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన పాక్‌ మంత్రి ఫవాద్‌ హుస్సేన్‌.. తాజాగా శ్రీలంక క్రికెటర్లు పాక్ టూర్‌ను విరమించుకోడానికి భారత్ కారణమంటూ ఆరోపించారు.సెప్టెంబర్ నెలాఖరున ప్రారంభం కానున్న పాక్ పర్యటనకు వెళ్లమంటూ పదిమంది శ్రీలంక క్రికెటర్లు ప్రకటించారు. గతంలో పాక్‌లో సీరీస్ కోసం వెళ్లగా.. ప్రాక్టీస్ చేస్తుండగా లంక ఆటగాళ్లపై ఉగ్రదాడి జరిగింది. అప్పటినుంచి దాదాపు అన్ని దేశాలు పాక్‌లో మ్యాచులను బహిష్కరించాయి. […]

భారత్ వల్లే.. శ్రీలంక క్రికెటర్లు పాక్ రావడం లేదు.. పాక్ మంత్రి
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 11, 2019 | 3:45 AM

Share

పాక్ మంత్రి మరోసారి భారత్‌పై నోరుపారేసుకున్నారు. ఇంతకు ముందు చంద్రయాన్‌ 2 ప్రయోగం సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన పాక్‌ మంత్రి ఫవాద్‌ హుస్సేన్‌.. తాజాగా శ్రీలంక క్రికెటర్లు పాక్ టూర్‌ను విరమించుకోడానికి భారత్ కారణమంటూ ఆరోపించారు.సెప్టెంబర్ నెలాఖరున ప్రారంభం కానున్న పాక్ పర్యటనకు వెళ్లమంటూ పదిమంది శ్రీలంక క్రికెటర్లు ప్రకటించారు. గతంలో పాక్‌లో సీరీస్ కోసం వెళ్లగా.. ప్రాక్టీస్ చేస్తుండగా లంక ఆటగాళ్లపై ఉగ్రదాడి జరిగింది. అప్పటినుంచి దాదాపు అన్ని దేశాలు పాక్‌లో మ్యాచులను బహిష్కరించాయి. ఈ నేపథ్యంలోనే పాక్ టూర్‌కు వెళ్లమంటూ పది మంది సీనియర్ క్రికెటర్లు తేల్చిచెప్పారు. అయితే దీనికి కారణం భారత్‌ అంటూ పాక్ మంత్రి ఫవాద్ హుస్సేన్ ఆరోపిస్తున్నారు. పాకిస్థాన్‌కు రాకుండా.. శ్రీలంక క్రికెటర్లను భారత్ బెదిరించిందన్నారు. పాకిస్థాన్‌లో పర్యటిస్తే.. తమ ఐపీఎల్ కాంట్రాక్ట్‌లు రద్దు చేస్తామని భారత్ భయపెట్టిందని.. అందుకే వారు రాలేదంటూ ట్వీట్ చేశారు.

షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27 నుంచి అక్టోబరు 9 వరకు పాక్‌లో శ్రీలంక జట్టు పర్యటించాల్సి ఉంది. ఈ టూర్‌లో లంక ఆటగాళ్లు ఆతిథ్య పాక్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే టీ20, వన్డే జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న లసిత్‌ మలింగా, దిముత్‌ కరుణరత్నే సహా పది మంది టాప్‌ ఆటగాళ్లు పాక్‌ పర్యటనకు నిరాకరించారు. గతంలో పాక్‌తో టెస్టు సందర్భంగా లాహోర్‌లో లంక ఆటగాళ్ల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ దాడిని దృష్టిలో ఉంచుకుని భద్రతా కారణాల రీత్యా తాము పాక్‌ పర్యటనకు రాలేమని లంక ఆటగాళ్లు స్పష్టం చేశారు.

Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో