AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్చువల్ సమ్మిట్… భారత్, బంగ్లాదేశ్ ప్రధానుల సమావేశం… పరస్పర సహకారమే లక్ష్యం….

భారత్ ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్ 17న వర్చువల్ సమావేశంలో పాల్గొననున్నారు. రెండు దేశాల మధ్య పరస్పర సహకారమే లక్ష్యంగా ఈ మీటింగ్ జరగనుందని భారతీయ విదేశాంగ శాఖ తెలిపింది.

వర్చువల్ సమ్మిట్... భారత్, బంగ్లాదేశ్ ప్రధానుల సమావేశం... పరస్పర సహకారమే లక్ష్యం....
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 16, 2020 | 1:10 PM

Share

భారత్ ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్ 17న వర్చువల్ సమావేశంలో పాల్గొననున్నారు. రెండు దేశాల మధ్య పరస్పర సహకారమే లక్ష్యంగా ఈ మీటింగ్ జరగనుందని భారతీయ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్ పరస్పర సహకారం, అభివృద్ధి కార్యక్రమాల్లో తోడ్పాటుపై చర్చ జరగనుందని పేర్కొంది.

కరోనా వ్యాక్సినేషన్, ఆ తర్వాత అనుసరించాల్సిన ఆర్థిక వ్యూహాలపై సైతం చర్చ ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా రెండు దేశాల మధ్య వివిధ స్థాయిల్లో, వివిధ సందర్భాల్లో ఈ విధమైన చర్చలను భవిష్యత్‌లో కొనసాగిస్తామని పేర్కొంది. కాగా, భారత్ – బంగ్లాదేశ్‌ల మధ్య చాలా ఏళ్లుగా సహకారపూర్వక వాతావరణమే కొనసాగుతోంది. బంగ్లా ప్రధాని హసీనా గత ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ సైతం మార్చి నెలలో ముజీబ్ సందర్భంగా ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపించారు.