Israel Hamas War: హమాస్ వద్ద బందీగా ఉందనుకున్నారు.. 47 రోజుల తర్వాత శవమై దొరికిన యువతి

షాని మరణం పట్ల యోకానిమ్ మేయర్ సైమన్ అల్ఫాసి సంతాపం వ్యక్తం చేస్తూ షానీ ఇక ఈ లోకంలో లేదనే విషయం  నమ్మలేకపోతున్నానని అన్నారు. షాని తిరిగి వస్తుందని 47 రోజులుగా ఎదురు చూస్తున్నామని.. అయితే షాని  మృత దేహం చూసిన తర్వాత ఆ ఆశ కూడా తీరిపోయిందని అన్నారు. ఆమె కోసం ఎదురుచూస్తున్న మేము ఇప్పుడు చేదు వార్త వినాల్సి వచ్చిందని చెప్పారు.  

Israel Hamas War: హమాస్ వద్ద బందీగా ఉందనుకున్నారు.. 47 రోజుల తర్వాత శవమై దొరికిన యువతి
Shani Gabay
Follow us

|

Updated on: Nov 23, 2023 | 1:12 PM

హమాస్ అక్టోబర్ 7న గాజా సరిహద్దు సమీపంలో ఒక సంగీత ఉత్సవంపై దాడి చేసిన తరువాత.. హమాస్ పట్టుకున్న బందీలలో ఒకరిగా భావించిన 25 ఏళ్ల ఇజ్రాయెల్ మహిళ మృతదేహం గురువారం కనుగొనబడినట్లు నివేదికలు తెలిపాయి. షానీ గబాయ్ పనిచేస్తున్న సూపర్‌నోవా మ్యూజిక్‌ ఫెస్టివల్‌ సమీపంలో కాలిపోయిన అంబులెన్స్‌ కింద షానీ మృతదేహం కనిపించిందని నివేదికలు తెలిపాయి. షాని మరణం పట్ల యోకానిమ్ మేయర్ సైమన్ అల్ఫాసి సంతాపం వ్యక్తం చేస్తూ షానీ ఇక ఈ లోకంలో లేదనే విషయం  నమ్మలేకపోతున్నానని అన్నారు. షాని తిరిగి వస్తుందని 47 రోజులుగా ఎదురు చూస్తున్నామని.. అయితే షాని  మృత దేహం చూసిన తర్వాత ఆ ఆశ కూడా తీరిపోయిందని అన్నారు. ఆమె కోసం ఎదురుచూస్తున్న మేము ఇప్పుడు చేదు వార్త వినాల్సి వచ్చిందని చెప్పారు.

దీనితో పాటు సైమన్ అల్ఫాసి కూడా షానీ కుటుంబానికి సానుభూతి తెలిపారు. షానీ తల్లిదండ్రులు జాకబ్, మిచల్ లతో పాటు సోదరుడు అవియెల్, అతని సోదరి నిట్జాన్‌లకు తన సంతాపాన్ని తెలిపారు. షానిని కనుగొని ఇంటికి తీసుకురావడానికి.. ఏడు వారాలుగా అన్ని విధాలుగా అధికారులు ప్రయత్నించారని తెలిపారు. వాస్తవానికి షాని కుటుంబం ఏదొక రోజు తమ కుమార్తె ఇంటికి తిరిగి వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే ఇప్పుడు తమ కుమార్తె మరణించింది అన్న వార్త తెలిసింది. ఇది నమ్మడం కష్టంగా ఉందంటూ కన్నీరు పెడుతున్నారు. గబే ఇటీవలి లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. వచ్చే వారం 26 ఏళ్లు పూర్తీ చేసుకుని 27వ ఏట అడుగు పెట్టనున్నదంటూ గుర్తుచేసుకున్నారు.

అక్టోబరు 7 నుంచి కనిపించకుండా షానీ గాబే

అక్టోబర్ 7న కిబ్బట్జ్ రీమ్‌లో జరిగిన సంగీత కచేరీలో షాని పనిచేస్తుంది. అదే సమయంలో హమాస్ ఉగ్రవాదులు సంగీతోత్సవంపై దాడి చేశారు. ఈ సమయంలో చుట్టూ గందరగోళం నెలకొంది. ఈ ఉగ్రదాడిలో 1200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఉగ్రవాదులు చిన్నారులతో సహా 240 మందికి పైగా బందీలుగా ఉన్నారు. ఈ సమయంలో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఇజ్రాయెల్ మీడియా నివేదికల ప్రకారం దాడి చేసిన సమయంలో షానీని కూడా ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. తర్వాత ఆమెను హత్య చేసినట్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్‌తో హమాస్ ఒప్పందం

తాజాగా కొంతమంది బందీలను విడుదల చేయడానికి ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం హమాస్ 50 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయనుంది. ఈ బందీలను 4 రోజుల కాల్పుల విరమణకు బదులుగా తమ దగ్గర ఉన్న బందీల్లో 50మందిని విడుదల చేస్తారు. ఈ బందీలలో ఎక్కువ మంది అక్టోబర్ 7 నుండి హమాస్ చెరలో ఉన్న పిల్లలు. ప్రతిరోజూ 12-13 మంది బందీలను హమాస్ విడుదల చేయనుందని వెల్లడించింది. అదే సమయంలో ఇజ్రాయెల్ తన జైళ్లలో ఉన్న 150 మంది పాలస్తీనా మహిళలు, పిల్లలను కూడా విడుదల చేయాల్సి ఉంటుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..