Iran-Israel War: మరోసారి ఇరాన్పై ఇజ్రాయెల్ దాడికి యత్నం.. ఇరాన్ టార్గెట్ అతనేనా?
తాజాగా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి ప్లాన్ లీకైంది. నాలుగు అరబ్ దేశాల్లో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా వ్యూహం సిద్ధం చేస్తున్నారు. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హతం తర్వాత ఇజ్రాయెల్ అతని మీదే ఫోకస్ పెట్టిందా?
ఇరాన్ ఇజ్రాయెల్తో యుద్ధానికి కాలు దువ్వుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా టెహ్రాన్లో ప్రాక్సీ సంస్థల కమాండర్ల సమావేశం జరిగింది. నాలుగు అరబ్ దేశాల్లో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా వ్యూహం సిద్ధం చేస్తున్నారు. 2015లో ఖమేనీ 2040 నాటికి ఇజ్రాయెల్ను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. దాదాపు లక్ష మంది సైనికులు ఇజ్రాయెల్పై దాడికి సిద్ధమవుతున్నారు. హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్ ఖాసిం, IRGC కమాండర్ల నేతృత్వంలో ఈ దాడి జరగబోతున్నట్లు తెలుస్తుంది.
మొదట ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి ప్లాన్ లీకైంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అలెర్ట్ అయింది. ఇరాన్పై దాడి చేయడానికి ఇజ్రాయెల్ వైమానిక దళం సన్నాహాలు చేసింది. 40 రాక్స్ ఎయిర్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్పై దాడి చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్పై దాడి చేయడానికి టెహ్రాన్ వేసిన ప్లాన్ కూడా లీకైంది. ఇజ్రాయెల్పై F-15, F-16, F-35 ఫైటర్ జెట్ల నుండి ప్రయోగించబోతున్నట్లు ఆ ప్లాన్ ద్వారా తెలుస్తుంది.
ఇజ్రాయెల్ హెజ్బొల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్ నయీమ్ ఖాసీంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఇరాన్ పారిపోయినట్లు కొన్ని ప్రముఖ మీడియా ఛానల్ కథనం ప్రచురించింది. ఈ నెల 5న బీరుట్ నుంచి ఇరాన్కి భయంతో పారిపోయినట్లు పేర్కొంది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ హతం చేసిన తర్వాత నయీమ్ ఖాసీం క్రియాశీలకంగా మారాడు.