AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 ఏళ్ల బాలుడు ఆన్‌లైన్‌లో AK-47 రైఫిల్ ఆర్డర్ చేశాడు.. అది చూసి తల్లి షాక్!.. ఆ తర్వాత ఏమైందంటే..

ఈ రోజుల్లో ఎవరైనా సరై.. అతి సులువుగా సైబర్ క్రైమ్ బాధితులుగా మారుతున్నారు. ఎందుకంటే, చాలా మంది పిల్లల దగ్గర ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్ ఉంటాయి. తెలియని క్లిక్‌తో హ్యాకర్ల వలలో చిక్కుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో అవగాహన చాలా ముఖ్యం అని చెబుతున్నారు బాలుడి తల్లి బార్బరా జెమెన్.

8 ఏళ్ల బాలుడు ఆన్‌లైన్‌లో AK-47 రైఫిల్ ఆర్డర్ చేశాడు.. అది చూసి తల్లి షాక్!.. ఆ తర్వాత ఏమైందంటే..
Ak 47 Rifle
Jyothi Gadda
|

Updated on: Jul 27, 2023 | 4:21 PM

Share

ఇప్పటి వరకు మీరు ఆహార పదార్థాలు, గాడ్జెట్‌లు లేదా ఇతర గృహోపకరణాలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి ఉంటారు. కానీ, 8 ఏళ్ల బాలుడు డార్క్ వెబ్ ద్వారా ఆన్‌లైన్‌లో ఏకే-47 ఆర్డర్ చేశాడు. ఆశ్చర్యకరంగా అనిపించినా..ఈ రైఫిల్ అతనికి డెలివరీ కూడా అయ్యింది. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని బాలుడి తల్లి స్వయంగా చెప్పింది. ఈ ఘటన జరిగింది నెదర్లాండ్స్‌లో తెలిసింది. మహిళ చెప్పిన వివరాల ప్రకారం.. తన 8 ఏళ్ల కొడుకు తనకు తెలియకుండా ఆన్‌లైన్‌లో ఏకే-47 కొన్నాడని పేర్కొంది. ఈ రైఫిల్ ఇంటికి చేరడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైనట్టుగా తెలిసింది. వెంటనే ఏం జరిగిందో ఆరా తీయగా… దీని వెనుక డార్క్ వెబ్, ఇంటర్నెట్ బ్లాక్ వరల్డ్, విచ్చలవిడిగా ఇలాంటి అక్రమాలు జరుగుతున్నట్లు తెలిసింది.

డార్క్ వెబ్ అంటే ఏమిటి?

Google, Bing వంటి శోధన ఇంజిన్‌ల ద్వారా ప్రస్తుతం ఉన్న కంటెంట్‌ని యాక్సెస్ చేయలేని ఇంటర్నెట్‌లో డార్క్ వెబ్ ఒక భాగం. దీనికి ప్రత్యేక బ్రౌజర్ అనుమతి అవసరం. డార్క్ వెబ్‌లోని కంటెంట్ ఏ చట్టం పరిధిలోకి రాదు. దీని ద్వారా డ్రగ్స్, ఆయుధాలు సహా అక్రమ పనులన్నీ జరుగుతున్నాయి. ఇది ఆనియన్ రూటింగ్ టెక్నాలజీపై పని చేస్తుంది, ఇది వినియోగదారులను ట్రాకింగ్, నిఘా నుండి రక్షిస్తుంది. నిషేధించబడిన వాటిని చాలా చౌకగా విక్రయించే అటువంటి స్కామర్లు కూడా ఇక్కడ ఉన్నారు. తక్కువ ధరకు వస్తువులను కొనుగోలు చేసే క్రమంలో లక్షల రూపాయలను ప్రజలు కోల్పోతున్నారు. అలాంటి మోసగాడి ఉచ్చులో చిక్కుకున్న మహిళ కొడుకు ఆన్‌లైన్‌లో రైఫిల్ ఆర్డర్ చేశాడు.

ఒక ఇంటర్వ్యూలో AK-47 కొనుగోలు చేసిన బాలుడి తల్లి బార్బరా జెమెన్ మాట్లాడుతూ.. అతను చాలా చిన్న వయస్సులో సైబర్ క్రైమ్ బారిలో ఎలా పడిపోయాడో వివరించింది. తన కొడుకు కంప్యూటర్‌పై ఎక్కువ సమయం గడిపేవాడని, 8 ఏళ్ల వయసులో హ్యాకింగ్ చేయడం ప్రారంభించాడని బార్బరా వెల్లడించింది. హ్యాకర్లు తన కుమారుడిని మనీలాండరింగ్‌కు కూడా ఉపయోగించుకున్నారని చెప్పింది. తమ కొడుకు ఎప్పుడూ ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతూ కోడ్ పదాలలో మాట్లాడేవాడని, ఈ క్రమంలోనే అతడు ఏకే 47 ఆర్డర్ చేశాడని తెలియడంతో తామంత భయాందోళనకు గురైనట్టుగా తెలిపారు. పైగా అతడు కస్టమ్స్ డ్యూటీలను తప్పించుకునే ప్రయత్నంలో పోలాండ్ నుండి బల్గేరియాకు తుపాకీని రవాణా చేశాడు. తర్వాత అది నెదర్లాండ్స్‌కు చేరుకుంది.

ఇవి కూడా చదవండి

కాగా, ఆన్‌ ఆర్డర్‌ ద్వారా డెలివరీ అయిన రైఫిల్‌ను తాము స్థానిక పోలీసు విభాగానికి అప్పగించామని చెప్పారు. విచారణలో అతడు అంతర్జాతీయ హ్యాకర్ల వలలో పడినట్లు నిర్ధారణ కావటంతో పోలీసులు తమ కొడుకును నిర్ధోషిగా విడిచిపెట్టారని చెప్పారు.. . ఈ సంఘటన తర్వాత, బార్బరా సైబర్ సెక్యూరిటీలో శిక్షణ పొందాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు అతను డచ్ పోలీసుల వద్ద సైబర్ స్పెషల్ వాలంటీర్ ఉన్నాడు.

అయితే, ఈ రోజుల్లో ఎవరైనా సరై.. అతి సులువుగా సైబర్ క్రైమ్ బాధితులుగా మారుతున్నారు. ఎందుకంటే, చాలా మంది పిల్లల దగ్గర ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్ ఉంటాయి. తెలియని క్లిక్‌తో హ్యాకర్ల వలలో చిక్కుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో అవగాహన చాలా ముఖ్యం అన్నారు బార్బరా జెమెన్.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us