Earthquake: బంగాళాఖాతంలో ఆకస్మిక భూకంపం..వణికిపోయిన ఆ దేశం.. భారత్‌కు అతి సమీపంలో.. సునామీ హెచ్చరికలు కూడా!

బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం 8.32 గంటలకు భయంకరమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.2గా నమోదైనట్లు నేషనల్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

Earthquake: బంగాళాఖాతంలో ఆకస్మిక భూకంపం..వణికిపోయిన ఆ దేశం.. భారత్‌కు అతి సమీపంలో.. సునామీ హెచ్చరికలు కూడా!
Earthquake

Updated on: Dec 05, 2022 | 1:33 PM

నైరుతి బంగాళాఖాతంలో ఒడిశాలోని పూరీ తీరంలో ఈరోజు ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాలు వణికిపోయాయి. ఒడిశాలోని పూరీనగర్‌కు 421 కిలోమీటర్లు, భువనేశ్వర్‌కు 434 కిలోమీటర్ల దూరంలో తూర్పు, ఆగ్నేయంగా నైరుతి బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం 8.32 గంటలకు భయంకరమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.2గా నమోదైనట్లు నేషనల్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

బంగ్లాదేశ్‌లో ప్రచురించబడిన ఢాకా ట్రిబ్యూన్, ఈ రోజు ఉదయం 9.05 గంటలకు రాజధాని నగరం ఢాకా, బంగ్లాదేశ్‌లోని చాలా ప్రాంతాలు అకస్మాత్తుగా కంపించాయి. భూకంప కేంద్రం ఢాకాకు నైరుతి దిశలో 529 కి.మీ, కాక్స్ బజార్‌కు నైరుతి దిశలో 340 కి.మీ, చిట్టగాంగ్‌కు నైరుతి దిశలో 397 కి.మీ. భారతదేశానికి అతి సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది.

ఇవి కూడా చదవండి

భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. బీచ్ ప్రాంతానికి కూడా ఎటువంటి నష్టం కలుగలేదని సమాచారం. భూకంపం సునామీని సృష్టిస్తుందో లేదో NCS చెప్పలేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us