AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earth Day: లక్షలాది కొవ్వొత్తులతో ఎర్త్ డే ను ప్రకాశవంతం చేసిన బౌద్ధ సన్యాసులు.. గిన్నీస్ రికార్డు కోసం ప్రయత్నం!

భూమిని కాపాడుకోవలసిన అవసరం అందరికీ ఉంది. పర్యావరణాన్ని కాపాడటం ద్వారా మాత్రమే భూమిని విపత్తుల నుంచి కాపాడుకోగలం. భూమిని అన్నిరకాల ఉపద్రవాల నుంచి రక్షించుకోవాలంటే సకల జనాళి క్రమశిక్షణ పాటించాల్సి ఉంటుంది.

Earth Day: లక్షలాది కొవ్వొత్తులతో ఎర్త్ డే ను ప్రకాశవంతం చేసిన బౌద్ధ సన్యాసులు.. గిన్నీస్ రికార్డు కోసం ప్రయత్నం!
Lights
KVD Varma
|

Updated on: Apr 25, 2021 | 5:50 PM

Share

Earth Day: భూమిని కాపాడుకోవలసిన అవసరం అందరికీ ఉంది. పర్యావరణాన్ని కాపాడటం ద్వారా మాత్రమే భూమిని విపత్తుల నుంచి కాపాడుకోగలం. భూమిని అన్నిరకాల ఉపద్రవాల నుంచి రక్షించుకోవాలంటే సకల జనాళి క్రమశిక్షణ పాటించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మన భూమి గురించి ఒకరోజు ప్రత్యేకంగా కేటాయించుకుని ప్రత్యేకంగా చర్చిస్తున్నాం. మొన్న శుక్రవారం ఎర్త్ డే (భూమి కోసం ఓ రోజు) ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్నాం. ఈ సందర్భంగా థాయ్‌లాండ్‌లోని బౌద్ధ సన్యాసులు నిర్వహించిన ఒక కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్ నెట్ లో వైరల్ గా మారాయి. ఎర్త్ డే సందర్భంగా థాయ్‌లాండ్‌లోని బౌద్ధ సన్యాసులు శుక్రవారం 3,30,000 కొవ్వొత్తులను వెలిగించి పండగ నిర్వహించారు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించడానికి.. మన భూమిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ప్రపంచానికి తెలియ చెప్పడానికి వారు ఈ విధంగా చేశారు. బ్యాంకాక్ శివార్లలోని వాట్ దమ్మ బౌద్ధ దేవాలయంలో సన్యాసులు ఏకకాలంలో 78 ఎకరాల ప్రదేశంలో.. 3,30,000 కొవ్వొత్తులను వెలిగించారు. ఈ ప్రకాశవంతమైన కొవ్వొత్తులు భూమి లోపల ధ్యానం చేసే బౌద్ధ సన్యాసి ఆకారాన్ని ఏర్పరుస్తాయి అని వారు ఈ సందర్భంగా ఒక ప్రత్యేక సందేశంలో పేర్కొన్నారు.

“మేము ఒక బౌద్ధ సంస్థ కాబట్టి, ‘మనస్సును శుభ్రపరచండి, ప్రపంచాన్ని శుభ్రపరచండి’ అనే ఇతివృత్తంతో ముందుకు వచ్చాము, ఇది ప్రపంచాన్ని శుభ్రపరచడం ప్రారంభించే ముందు వారి మనస్సులను శుభ్రపరచమని ప్రజలకు గుర్తు చేయడమే” అని ఆలయ కమ్యూనికేషన్ విభాగం డైరెక్టర్ వెనెరబుల్ సానిత్వాంగ్ వుతివాంగ్సో వార్తా సంస్థ రాయిటర్స్‌తో చెప్పారు.

ఈ కార్యక్రమం గురించి ఫేస్ బుక్ లో వచ్చిన ఒక పోస్ట్:

ఈ కార్యక్రమానికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి ఒక అధికారి హాజరైనట్లు వుతివాంగ్సో చెప్పారు, అయితే ఈ ఆలయం అధికారిక ప్రపంచ రికార్డును సృష్టించగలిగిందా లేదా అనేది స్పష్టం కాలేదు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వెబ్‌సైట్ ప్రకారం, కొవ్వొత్తులను ఉపయోగించి అతిపెద్ద జ్వలించే చిత్రానికి ప్రస్తుత రికార్డును 14 ఏప్రిల్ 2014 న ఫిలిప్పీన్స్‌లోని ఇలోయిలో మిడిల్ వే మెడిటేషన్ ఇన్స్టిట్యూట్ (ఫిలిప్పీన్స్) సాధించింది. వారు 56,680 కొవ్వొత్తులను వెలిగించారు. ఆ రకంగా చూస్తే దానిని మించి ఈ కార్యక్రమం జరిగిందని చెప్పుకోవాలి.

ఈ కార్యక్రమంలో, సన్యాసులు ఒక బంగారు మందిరం చుట్టూ “ఏ జాతీయత, జాతి, మతం యొక్క ప్రజలను జపించడం, సమూహ ధ్యానం, ప్రేమపూర్వక దయను పంచుకోవడం వంటి కార్యక్రమాలలో పాల్గొనడానికి ప్రోత్సహించటం” అనే ఉద్దేశ్యంతో నినాదాలు చేశారు. కరోనావైరస్ పరిమితుల కారణంగా జూమ్ ద్వారా సుమారు 300,000 మంది సన్యాసులు మరియు భక్తులు ఈ కార్యక్రమానికి హాజరైనట్లు అంచనా.

ఇదిలా ఉంటె, ఈ కార్యక్రమంపై విమర్శలూ తలెత్తుతున్నాయి.. చాలా మంది ప్రజలు ఈ ఆలోచనను ప్రశంసించగా, పారాఫిన్ మైనపును కాల్చడం మసిని ఉత్పత్తి చేస్తుందని, ఇది పర్యావరణానికి హానికరం అని కొందరు వాదిస్తున్నారు.

ఎర్త్ డే కోసం ఆలోచనను విస్కాన్సిన్కు చెందిన యుఎస్ సెనేటర్ గేలార్డ్ నెల్సన్ మొదటిసరిగా చేశారు. ఎర్త్ డే ను మొట్టమొదట ఏప్రిల్ 22, 1970 న జరుపారు. ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన వాతావరణం కోసం దేశవ్యాప్తంగా 20 మిలియన్ల అమెరికన్లు ఆరోజు వీధుల్లోకి వచ్చారు.

Also Read: Facebook: ఫేస్ బుక్ అధినేత అయినా ఒక తండ్రికి బిడ్డే.. వైరల్ గా మారిన మార్క్ జుకర్‌బర్గ్‌ తండ్రి కామెంట్స్!

పీఎం కేర్స్ ఫండ్ నిధులతో దేశవ్యాప్తంగా 551 ఆక్సిజన్ తయారీ ప్లాంట్ల ఏర్పాటు, కేంద్రం వెల్లడి