జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్పై పాకిస్తాన్ సైన్యం అబద్ధం చెప్పిందా..? అసలు నిజం ఇదేనా?
బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బోలాన్లో రైలు హైజాకింగ్ ముగిసిందని పాకిస్తాన్ సైన్యం పేర్కొంది, కానీ ఈ హైజాకింగ్ ముగియలేదని నేరుగా చెప్పే 5 ఆధారాలు ఉన్నాయి. బలూచిస్తాన్ ఫైటర్లు 150 మంది పాకిస్తాన్ సైనికులు తమ అదుపులో ఉన్నారని పేర్కొన్నారు.

బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బోలాన్లో రైలు హైజాక్పై పాకిస్తాన్ సైన్యం చెప్పిన అబద్ధం బయటపడింది. పాకిస్తాన్ సైన్యం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది. పాక్ సైనికులు ఇంకా 150 మంది మాతో ఉన్నారని తెలిపింది. పాకిస్తాన్ సైన్యం తన సైనికుల పట్ల సీరియస్గా లేదని BLA చెబుతోంది.
జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ జరిగిన 24 గంటల తర్వాత, మంగళవారం(మార్చి11) సాయంత్రం, పాకిస్తాన్ ఆర్మీ అధికారులు విలేకరుల సమావేశం నిర్వహించారు. హైజాక్ ఆపరేషన్ను ముగించినట్లు పేర్కొన్నారు. కానీ ఈ వాదనలు నిరాధారమైనవని నిరూపించింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ.
విడుదల కాని రైలు ఆపరేషన్ వీడియో
సోమవారం(మార్చి 10) నాడు బలూచ్ లిబరేషన్ ఫైటర్స్ జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేశారు. దీంతో బోలాన్ సమీపంలోని సొరంగంలో రైలు ఆగిపోయింది. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులను హతమార్చిందని, హైజాకర్ను ఓడించిందని చెబుతోంది. కానీ అక్కడి నుండి రైలు కార్యకలాపాలు ఎందుకు తిరిగి ప్రారంభించలేదో వివరించలేకపోయింది. ఆపరేషన్ ముగింపు, రైలు నిర్వహణకు సంబంధించిన ఎలాంటి వీడియోను పాకిస్తాన్ సైన్యం విడుదల చేయలేదు. దీనికి విరుద్ధంగా, పాకిస్తాన్ రైల్వేలు బలూచిస్తాన్లో అన్ని రైళ్ల నిర్వహణను మూడు రోజుల పాటు నిలిపివేసింది. సాధారణంగా, అటువంటి సంఘటన జరిగినప్పుడల్లా, సంఘటన జరిగిన ప్రదేశానికి సంబంధించిన ఫుటేజ్ను మీడియా ద్వారా లేదా ప్రభుత్వం ద్వారా విడుదల చేస్తారు. ఇప్పటివరకు పాకిస్తాన్ సైన్యం అక్కడి నుండి ఎలాంటి వీడియోను విడుదల చేయలేకపోయింది. మరోవైపు, బలూచ్ ఫైటర్లు హైజాకింగ్ వీడియోను విడుదల చేశారు.
బోలాన్ ఆపరేషన్ తప్పుడు ఫోటోలు
ఆపరేషన్ ముగిసింది అంటూ పాకిస్తాన్ సైన్యం బోలాన్ ఆపరేషన్ ఫోటోలను కొంతమంది స్థానిక జర్నలిస్టులకు పంపింది. అందులో BLA ఫైటర్ల మృతదేహాల చిత్రాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ జర్నలిస్టులు అనాస్ మాలిక్, ముజమ్మల్ వహ్రైచ్ దీనిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ తరువాత ఈ ఫోటో ఏప్రిల్ 2024 నాటిదని తేలింది. వాస్తవ తనిఖీ తర్వాత, జర్నలిస్టులు వెంటనే ఆ ఫోటోను తొలగించారు. పాకిస్తాన్ సైన్యం 33 మంది ఫైటర్లను చంపినట్లు చెబుతుండగా, BLA ఇద్దరు వ్యక్తులు మాత్రమే చనిపోయినట్లు మాత్రమే అంగీకరించింది.
క్వెట్టాకు 3. 200 శవపేటికలు ఎందుకు..?
పాకిస్తాన్ సైన్యం 200 శవపేటికలతో క్వెట్టాను చేరుకుంది. దీని గురించి పాకిస్థాన్ ఆర్మీ అధికారులను ప్రశ్నలు అడిగినప్పుడు, వారు సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారు. క్వెట్టాకు 200 శవపేటికలను ఎందుకు తీసుకువచ్చారో పాక్ ఆర్మీ అధికారులు వివరించలేకపోయారు. ప్రభుత్వం వినకపోతే, ప్రతి గంటకు 5 మంది సైనికులను చంపి బహుమతిగా పంపుతామని BLA ఫైటర్లు హెచ్చరించారు.
అర్థరాత్రి వరకు ప్రతిధ్వనించిన ఆపరేషన్
స్థానిక వార్తాపత్రిక బలూచిస్తాన్ పోస్ట్ ఒక కథనంలో ఈ ఆపరేషన్ అర్థరాత్రి వరకు ప్రతిధ్వనించిందని పేర్కొంది. పాకిస్తాన్ సైనికులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్థానిక ప్రజలు తమ ఇళ్లను వదిలి బయటకు వెళ్లడాన్ని నిషేధించారు. పాక్ ఆర్మీ హెలికాప్టర్లు రాత్రిపూట ఎగురుతున్నాయి. వార్తాపత్రిక కథనం ప్రకారం, ఈ ఆపరేషన్లో 240 మంది సైనికులు పాల్గొంటున్నారు. పర్వతాలు, సొరంగాల కారణంగా, ఆపరేషన్లో ఇబ్బందులు తలెత్తున్నాయి.
BLA ఫైటర్ల పేర్లు, ఆయుధాల వివరాలు ఎక్కడ?
రైలు హైజాక్ తర్వాత పాకిస్తానీ సైనికుల పూర్తి వివరాలను BLA విడుదల చేసింది. కానీ మరోవైపు, ఆపరేషన్ ముగిసిన తర్వాత, పాకిస్తాన్ సైన్యం BLA ఫైటర్ల గురించి లేదా వారి నుండి స్వాధీనం చేసుకున్న ఆయుధాల గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. సాధారణంగా, ఆపరేషన్ ముగిసిన తర్వాత, ప్రజలకు ధైర్యం కలిగించేందుకు పోలీసులు, అధికారులు అటువంటి సమాచారాన్నంతా మీడియాకు అందిస్తారు. పాకిస్తాన్ సైన్యం ఈ ఆపరేషన్ నుండి దూరంగా ఉండటం ద్వారా తనను తాను ఇబ్బంది నుండి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..