AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగ్లాదేశ్‌లో బిగుస్తున్న ఉచ్చు.. మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష పడుతుందా?

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కష్టాలు మరింత పెరిగాయి. జూలై తిరుగుబాటుపై అణిచివేత సమయంలో మానవాళికి వ్యతిరేకంగా నేరాలు జరిగాయని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) ప్రాసిక్యూటర్ అధికారికంగా ఆరోపించింది. ఆదివారం(జూన్ 01) ప్రాసిక్యూషన్ చార్జిషీట్‌ను సమర్పించింది. ఈ ఆరోపణలు రుజువైతే, షేక్ హసీనాకు మరణశిక్ష విధించవచ్చు.

బంగ్లాదేశ్‌లో బిగుస్తున్న ఉచ్చు.. మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష పడుతుందా?
Sheikh Hasina
Balaraju Goud
|

Updated on: Jun 01, 2025 | 3:55 PM

Share

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కష్టాలు మరింత పెరిగాయి. జూలై తిరుగుబాటుపై అణిచివేత సమయంలో మానవాళికి వ్యతిరేకంగా నేరాలు జరిగాయని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) ప్రాసిక్యూటర్ అధికారికంగా ఆరోపించింది. ఆదివారం(జూన్ 01) ప్రాసిక్యూషన్ చార్జిషీట్‌ను సమర్పించింది. ఈ ఆరోపణలు రుజువైతే, షేక్ హసీనాకు మరణశిక్ష విధించవచ్చు. చార్జిషీట్‌లో షేక్ హసీనాతో పాటు మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఐజీపీ చౌదరి మామున్‌లను కూడా సహ నిందితులుగా చేర్చారు. కేసు పారదర్శకతను కాపాడటానికి బంగ్లాదేశ్ టెలివిజన్‌లో విచారణను ప్రత్యక్ష ప్రసారం చేశారు.

గత ఏడాది జూలై-ఆగస్టులలో దేశవ్యాప్త హింసకు, ఆ తరువాత జరిగిన పోలీసు అణచివేతకు షేక్ హసీనా ప్రధాన ప్రేరేపకురాలిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీని ఫలితంగా ఊచకోత జరిగింది. మే 12న, దర్యాప్తు అధికారులు ఒక నివేదికను సమర్పించారు. అందులో హసీనా హత్యలకు ఆదేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి. షేక్ హసీనాపై అభియోగాలు మోపింది ట్రిబ్యునల్. పాకిస్తాన్ నుండి విముక్తి పొందిన తరువాత పాకిస్తాన్ సైనికులను విచారించడానికి దీనిని సృష్టించారు. దీని కింద చాలా మంది జమాత్, బిఎన్‌పి నాయకులను కూడా విచారించి మరణశిక్ష విధించారు.

ఇదిలావుంటే, బంగ్లాదేశ్ తిరుగుబాటు తర్వాత షేక్ హసీనా భారతదేశంలోనే నివసిస్తున్నారు. నిరసనల తర్వాత ఆమె భారతదేశానికి వచ్చేశారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనాను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. కానీ భారతదేశం అలాంటి ఏ డిమాండ్‌కూ స్పందించలేదు. షేక్ హసీనా హయాంలో భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయి. కానీ ఆమె తిరుగుబాటు తర్వాత వారిలో చీలిక ఏర్పడింది. సలహాదారు యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం చైనా, పాకిస్తాన్ వైపు మొగ్గు చూపుతుండగా, భారతదేశం బంగ్లాదేశ్‌తో సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..