AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బస్సు బోల్తా.. 28మంది బలి

పోర్చుగీస్ : యూరోప్‌లోని మ‌దేరా దీవిలో ఘోర బ‌స్సు ప్ర‌మాదం జ‌రిగింది. ప‌ర్యాట‌కుల‌తో వెళ్తున్న బ‌స్సు అదుపుతప్పి లోయలో ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో 28 మంది జ‌ర్మ‌నీకి చెందిన టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 27 మంది గాయ‌ప‌డ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోర్చుగీస్ దీవి అయిన మ‌దేరాలోని కానికో ప‌ట్ట‌ణంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. […]

బస్సు బోల్తా..  28మంది బలి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 18, 2019 | 2:14 PM

Share

పోర్చుగీస్ : యూరోప్‌లోని మ‌దేరా దీవిలో ఘోర బ‌స్సు ప్ర‌మాదం జ‌రిగింది. ప‌ర్యాట‌కుల‌తో వెళ్తున్న బ‌స్సు అదుపుతప్పి లోయలో ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో 28 మంది జ‌ర్మ‌నీకి చెందిన టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 27 మంది గాయ‌ప‌డ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోర్చుగీస్ దీవి అయిన మ‌దేరాలోని కానికో ప‌ట్ట‌ణంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మరణించిన వారిలో 11 మంది పురుషులు, 17 మంది మ‌హిళ‌లు ఉన్నారు. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో మొత్తం 55 మంది ప్ర‌యాణికులు ఉన్నారు.