ఘోరం.. కిడ్నాప్.. బలవంతపు మతమార్పిడి.. ఆపై వివాహం చేసి..
పాకిస్థాన్లో మైనార్టీ బాలికల కిడ్నాప్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా మైనార్టీలైన హిందూ, సిక్కు, క్రైస్తవ యువతులే లక్ష్యంగా అపహరణలు జరుగుతున్నాయి. అంతటితో ఆగకుండా.. వారిని బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారు. ఆపై ముస్లిం యువకుడితో వివాహం చేస్తున్నారు. ఈ నెల 14న సింధ్ ప్రావిన్స్కు చెందిన ఇద్దరు హిందూ బాలికలు కిడ్నాప్ గురయ్యారు. వారిని బలవంతంగా మతం మార్చి.. ముస్లిం యువకులతో వివాహం చేశారు. ఇదిలా ఉండగానే.. తాజాగా మరో బాలిక కిడ్నాప్కు గురైంది. […]
పాకిస్థాన్లో మైనార్టీ బాలికల కిడ్నాప్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా మైనార్టీలైన హిందూ, సిక్కు, క్రైస్తవ యువతులే లక్ష్యంగా అపహరణలు జరుగుతున్నాయి. అంతటితో ఆగకుండా.. వారిని బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారు. ఆపై ముస్లిం యువకుడితో వివాహం చేస్తున్నారు. ఈ నెల 14న సింధ్ ప్రావిన్స్కు చెందిన ఇద్దరు హిందూ బాలికలు కిడ్నాప్ గురయ్యారు. వారిని బలవంతంగా మతం మార్చి.. ముస్లిం యువకులతో వివాహం చేశారు.
ఇదిలా ఉండగానే.. తాజాగా మరో బాలిక కిడ్నాప్కు గురైంది. ఆ బాలికను కూడా బలవంతంగా ఇస్లాంలోకి మార్పించి, ముస్లిం యువకుడితో పెళ్లి చేశారు. ఈ ఘటన కూడా సింధ్ ప్రావిన్స్లోని జకోబాబాద్ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై అకాలీదళ్ ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ సిర్సా ఘాటుగా స్పందించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్, లాహోర్ వైస్రాయ్ జకరియా ఖాన్ల హయాంలోనూ ఇలాంటి బలవంతపు మతమార్పిడులు జరిగాయని.. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.