AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యోగులకు బిగ్‌ రిలీఫ్.. లేఆప్స్‌ విషయంలో కోర్టు సంచలన తీర్పు.. ఇకపై అలా చేస్తే కుదరదు

China Court Rules AI-Driven Layoffs Illegal: ఉద్యోగుల తొలగింపు విషయంలో చైనా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పేరుతో ఇష్టానుసారంగా ఉద్యోగులను కంపెనీల నుంచి తొలగించడానికి వీల్లేదని చైనా న్యాయస్థానం తెలిపింది. ఏఐ సాంకేతికతను సాకుగా చూపి కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించడం చట్టవిరుద్ధమని కోర్టులు స్పష్టం చేశాయి.

ఉద్యోగులకు బిగ్‌ రిలీఫ్.. లేఆప్స్‌ విషయంలో కోర్టు సంచలన తీర్పు.. ఇకపై అలా చేస్తే కుదరదు
Mployee Protection Law
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: May 03, 2026 | 5:32 PM

Share

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో ఏఐ రాకతో అనేక కంపెనీలు తమ పని విధానాన్ని పూర్తిగా మార్చుకుంటున్నాయి. ఖర్చులు తగ్గించుకునే ఉద్దేశంతో మనుషుల స్థానంలో ఏఐని వాడుకుంటూ పాత ఉద్యోగులను అర్ధాంతరంగా ఇళ్లకు పంపుతున్నాయి. ఈ క్రమంలో చైనాలోని పలు దిగ్గజ సంస్థలు సైతం తమ సిబ్బందిని భారీ సంఖ్యలో విధుల నుంచి తొలగించాయి. దీనిపై అక్కడి కార్మికులు న్యాయపోరాటానికి దిగడంతో ఈ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది.

ఈ వివాదాలపై లోతైన విచారణ చేపట్టిన చైనా న్యాయస్థానాలు పూర్తిగా కార్మికుల పక్షాన నిలబడ్డాయి. ఏఐ వల్ల పని సులభతరం అవుతుంది కానీ అదే కారణంతో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని రోడ్డున పడేయడం ఏమాత్రం సరికాదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. కంపెనీలు కేవలం లాభాల కోసమే చూసుకోకుండా ఉద్యోగుల కుటుంబాల పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

లేఆఫ్స్ పేరుతో కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యాజమాన్యాలను కోర్టులు గట్టిగా హెచ్చరించాయి. ఒకవేళ సాంకేతిక కారణాలతో ఎవరినైనా విధుల నుంచి తప్పించాల్సి వస్తే వారికి చట్టబద్ధంగా చెల్లించాల్సిన పరిహారం మొత్తం కచ్చితంగా ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పాయి. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా రాత్రికి రాత్రే ఉద్యోగాలు పీకేయడం చట్టాలకు విరుద్ధమని స్పష్టం చేశాయి.

అత్యాధునిక ఏఐ మోడల్స్ అందుబాటులోకి వచ్చాక కంటెంట్ క్రియేషన్, కోడింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి విభాగాల్లో మనుషుల అవసరం భారీగా తగ్గిపోయింది. ఈ సాకుతో యాజమాన్యాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కోర్టులు ఇచ్చిన ఈ తీర్పుతో చైనాలోని లక్షలాది మంది టెక్ అలాగే ఇతర రంగాల ఉద్యోగులకు ఊహించని రీతిలో భారీ ఊరట లభించినట్లు అయింది.

ప్రస్తుతం చైనా కోర్టులు ఇచ్చిన ఈ తీర్పు ప్రపంచ దేశాలకు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది. ఏఐ అనేది మనుషులకు సహాయకారిగా ఉండాలి తప్ప వారి పొట్టగొట్టే సాధనంగా మారకూడదని ఈ పరిణామం తెలియజేస్తోంది. రాబోయే రోజుల్లో భారత్ సహా ఇతర దేశాల్లో కూడా ఇలాంటి న్యాయపరమైన రక్షణలు వస్తాయని ఐటీ నిపుణులు ఉద్యోగులు తీవ్ర ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏఐ పేరుతో ఉద్యోగుల భద్రతను గాలికొదిలేసే కంపెనీలకు ఇది ఒక చెంపపెట్టు లాంటిది.

మొత్తంగా చూసుకుంటే టెక్నాలజీ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు కానీ దాని వల్ల సామాన్యుల బతుకులు నాశనం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు అలాగే కోర్టుల మీదే ఉంది. చైనా కోర్టుల తాజా నిర్ణయం ఆ దిశగా వేసిన ఒక బలమైన అడుగుగా చెప్పవచ్చు. భవిష్యత్తులో కార్మిక చట్టాలు ఏఐకి అనుగుణంగా మరింత పటిష్టంగా మారాల్సిన అవసరాన్ని ఈ సంచలన తీర్పు నొక్కి చెబుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us