AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET-UG 2026: ‘వార్ రూమ్’లో కేంద్ర మంత్రి.. పరీక్షా సరళిని స్వయంగా పర్యవేక్షించిన ధర్మేంద్ర ప్రధాన్

దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2026 నిర్వహణను పర్యవేక్షించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం (మే 03) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. పరీక్షా ప్రక్రియలో పారదర్శకత, భద్రత, అభ్యర్థుల సౌకర్యార్థం తీసుకున్న చర్యలను ఆయన స్వయంగా సమీక్షించారు.

NEET-UG 2026: 'వార్ రూమ్'లో కేంద్ర మంత్రి.. పరీక్షా సరళిని స్వయంగా పర్యవేక్షించిన ధర్మేంద్ర ప్రధాన్
Union Minister Dharmendra Pradhan In Nta Headquarters
Balaraju Goud
|

Updated on: May 03, 2026 | 5:09 PM

Share

దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీ (NEET-UG) 2026 నిర్వహణను పర్యవేక్షించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం (మే 03) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. పరీక్షా ప్రక్రియలో పారదర్శకత, భద్రత, అభ్యర్థుల సౌకర్యార్థం తీసుకున్న చర్యలను ఆయన స్వయంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ NTA కంట్రోల్ రూమ్ నుండి దేశవ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాల ప్రత్యక్ష పర్యవేక్షణ వ్యవస్థను పరిశీలించారు. సుమారు 23 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్న ఈ భారీ పరీక్ష కోసం ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్, కేంద్రాలతో సమన్వయం, సాంకేతిక మౌలిక సదుపాయాల గురించి అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, “పరీక్షా నిర్వహణలో ఎటువంటి లోపాలకు తావులేకుండా పకడ్బందీగా వ్యవహరించాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడటం ప్రాధాన్యత,” అని పేర్కొన్నారు.

ఈ ఏడాది రికార్డు స్థాయిలో దరఖాస్తులు రావడంతో, NTA పక్కాగా ఏర్పాట్లు చేసింది. ప్రతి కేంద్రం వద్ద బయోమెట్రిక్ హాజరు, ఆధునిక స్కానింగ్ పరికరాల వినియోగం కోసం ఏర్పాట్లు చేశారు. అక్రమాలను అరికట్టేందుకు కృత్రిమ మేధస్సు ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. 500లకు పైగా నగరాల్లో సజావుగా పరీక్ష జరిగేలా ప్రత్యేక పరిశీలకులను నియమించారు.

దేశంలోని మెడికల్ కాలేజీల్లో MBBS, BDS సహా ఇతర అనుబంధ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ యూజీ ఏకైక మార్గంగా ఉన్నందున, ఈ పరీక్షపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఎటువంటి అవాంతరాలు లేకుండా పరీక్ష పూర్తి చేయడమే లక్ష్యమని NTA అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us