AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్‌లో యూఎస్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ సిఐఎ చీఫ్ విలియం బర్న్స్..ముల్లా బరదార్‌తో రహస్య చర్చలు!

ఆగస్టు 31 తర్వాత తన దళాలు కాబూల్‌లో ఉండవచ్చని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మొన్న చెప్పారు. ఆ రోజు తరువాత అమెరికా దళాలు ఆఫ్ఘన్ లో ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని తాలిబాన్లు అమెరికాను బెదిరించారు.

Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్‌లో యూఎస్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ సిఐఎ చీఫ్ విలియం బర్న్స్..ముల్లా బరదార్‌తో రహస్య చర్చలు!
Afghanistan Crisis
KVD Varma
|

Updated on: Aug 25, 2021 | 8:19 AM

Share

Afghanistan Crisis: ఆగస్టు 31 తర్వాత తన దళాలు కాబూల్‌లో ఉండవచ్చని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మొన్న చెప్పారు. ఆ రోజు తరువాత అమెరికా దళాలు ఆఫ్ఘన్ లో ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని తాలిబాన్లు అమెరికాను బెదిరించారు. వీటన్నింటి మధ్య, యుఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఎ చీఫ్ విలియం బర్న్స్ సోమవారం అకస్మాత్తుగా కాబూల్‌కు రహస్య మిషన్ కింద వచ్చారు.  ఇక్కడ ఆయన  తాలిబాన్ నాయకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్‌ను కలిశాడు. ఈ సమావేశాన్ని అమెరికన్ వార్తాపత్రిక ‘వాషింగ్టన్ పోస్ట్’ వెల్లడించింది. అయితే, అమెరికా విదేశాంగ శాఖ లేదా వైట్ హౌస్ దీని గురించి ఏమీ చెప్పడానికి సిద్ధంగా లేవు.

వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం  బర్న్స్ అకస్మాత్తుగా సోమవారం ఉదయం కాబూల్  వచ్చారు.  అక్కడ తాలిబాన్ నాయకుడు బరాదర్ కలుసుకున్నారు. కాబూల్‌లో తాలిబాన్ ఆక్రమణ తర్వాత అమెరికాలోని అత్యున్నత దౌత్యవేత్త ఉగ్రవాద సంస్థ అగ్ర నాయకుడితో సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఈ అజ్ఞాత పరిస్థితిపై యుఎస్ అధికారులు జరిగిన సమావేశాన్ని ధృవీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, ”ఇది చాలా సున్నితమైన విషయం. బర్న్స్ అమెరికా అగ్రశ్రేణి, ఇంటెలిజెన్స్,  సైనిక వ్యవహారాలపై సీనియర్ నిపుణుడు మాత్రమే కాదు, అతను అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త కూడా.” అని చెప్పారు.

ప్రతిచోటా నిశ్శబ్దం CIA, వైట్ హౌస్, విదేశాంగ శాఖ దీని గురించి మౌనంగా ఉన్నాయి. కేవలం రెండు రోజుల క్రితం, వైట్ హౌస్ విలేకరుల సమావేశంలో, అఫ్ఘనిస్తాన్‌లో చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నప్పటికీ అమెరికా దౌత్యవేత్త ఎందుకు అక్కడికి వెళ్లలేదని అక్కడి మీడియా  ప్రశ్నించింది.  ఈ ప్రశ్నకు సమాధానం రాలేదు. కానీ, కాబూల్ నుండి ప్రజలను తరలించే మిషన్ చాలా సవాలుగా ఉందని ఈ సందర్భంగా బిడెన్ వివరించారు.

వాషింగ్టన్ కథనం ప్రకారం అమెరికా మిత్రదేశాలు, NATO దేశాలు ఆగస్టు 31 తర్వాత మరికొన్ని రోజులు అమెరికా సైన్యాలు కాబూల్‌లో ఉండాలని ఒత్తిడి చేస్తున్నాయి. తద్వారా వారు తమ పౌరులను, సహాయక సిబ్బందిని ఆఫ్గనిస్తాన్ నుంచి క్షేమంగా  తిరిగి తీసుకువస్తారు. మరోవైపు, ఆగస్టు 31 తర్వాత అమెరికా సైనికులు దేశం విడిచి వెళ్లకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తాలిబాన్లు హెచ్చరిస్తున్నారు. బర్న్స్‌ను కాబూల్‌కు పంపడం బహుశా ఈ కష్టాన్ని అధిగమించడానికి మాత్రమే కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈయన మరికొంత గడువును కోరడం కోసమే కాబూల్ వచ్చి ఉంటారని వారు అభిప్రాయపడుతున్నారు.

బర్న్స్.. బరదార్ ఇద్దరూ పాత మిత్రులే!

ముల్లా బరదార్..బర్న్స్ ఒకరికొకరు కొత్త కాదు. వాస్తవానికి, 11 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI తన దేశంలో బరదార్‌ను అరెస్టు చేసి, అమెరికాకు అప్పగించినప్పుడు, బర్న్స్ కూడా ఈ మిషన్‌లో భాగంగ ఉన్నారు. బరదార్ ఎనిమిది సంవత్సరాలు జైలులో ఉన్నాడు. అతను 2018 లో విడుదలయ్యాడు. బారదార్.. బర్న్స్ ఇద్దరూ కూడా ఖతార్.. దోహాలో అమెరికాతో చర్చలలో పాల్గొన్నారు. బరదార్ సోవియట్ దళాలకు వ్యతిరేకంగా కూడా పోరాడాడు. బర్న్స్ ఆ సమయంలో రష్యాలో అమెరికా రాయబారిగా ఉన్నారు. ఏప్రిల్‌లో కూడా బర్న్స్ రహస్య సందర్శన కోసం కాబూల్ వెళ్లారు.

Also Read: Afghan – India: తాలిబాన్ల రాకతో అఫ్గనిస్థాన్‌లో భారత్‌కు చిక్కులు తప్పవా? ఇప్పుడు మనముందున్న ఆప్షన్స్ ఇవేనా?

Afghanistan Crisis: పంజ్‌షీర్‌లో తీవ్ర పోరాటం..50 మంది తాలిబన్ సైనికుల హతం..బందీలుగా 20 మంది!