Afghan-Taliban: ఆఫ్ఘానిస్థాన్ ఆక్రమణతో మారిన తాలిబన్ల జాతకం.. అప్పన్నంగా దక్కిన ఇంద్రభవనం!

Taliban Luxury camp: నిరంతరం కొండల్లో గుట్టల్లో లోయల్లో ఇసుక దిబ్బల్లో నివసించిన తాలిబన్లకు ఓ ఇంద్రభవనం అప్పనంగా దక్కింది..అది ఇంద్రభవనమంటే ఇంద్రభవనమే!

Afghan-Taliban: ఆఫ్ఘానిస్థాన్ ఆక్రమణతో మారిన తాలిబన్ల జాతకం.. అప్పన్నంగా దక్కిన ఇంద్రభవనం!
Abdul Rashid Dostum's Palace
Follow us

|

Updated on: Sep 13, 2021 | 6:29 PM

Taliban Luxury camp: నిరంతరం కొండల్లో గుట్టల్లో లోయల్లో ఇసుక దిబ్బల్లో నివసించిన తాలిబన్లకు ఓ ఇంద్రభవనం అప్పనంగా దక్కింది..అది ఇంద్రభవనమంటే ఇంద్రభవనమే! పెద్ద పెద్ద గదులు, హంసతూలిక తల్పాలు, ఖరీదైన ఫర్నీచర్‌, షాండిలైర్స్‌, విద్యుత్‌ వెలుగులు, స్విమ్మింగ్‌ పూల్‌, జిమ్‌, ఫారిన్‌ లిక్కర్‌తో కూడిన చిన్నసైజు బార్‌.. ఇవన్నీ ఉన్నప్పుడు ఇంద్రభవనం కాక మరేమిటి? అలాంటి అద్భుతమైన ప్యాలెస్‌ ఇప్పుడు అఫ్గానిస్తాన్‌ తాలిబన్ల చేతిలో చిక్కింది. తాలిబన్ల భయానికి ఆ ప్యాలెస్‌ యజమాని పారిపోతే తాలిబన్లు దాన్ని ఆక్రమించేసుకున్నారు. ఇప్పుడు అందులో ఓ 150 మంది తాలిబన్‌ సభ్యులు ఉంటున్నారు. ఆ భవనం యజమాని ఎవరనుకుంటున్నారు? అఫ్గానిస్తాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అబ్దుల్‌ రషీద్‌ దోస్తమ్‌! ఆయనదే ఈ నివాసం.

67 ఏళ్ల అబ్దుల్‌ రషీద్‌ దోస్తమ్‌కు తాలిబన్లంటే అసలు పడదు.. ఇతడి పేరు వింటేనే తాలిబన్లు కోపంతో ఊగిపోతారు.. ఒకప్పుడు పారా ట్రూపర్‌గా, కమ్యూనిస్టు కమాండర్‌గా ఉన్న దోస్తమ్‌ కొంతకాలం పాటు ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. 2001లో రెండు వేల మందికిపైగా తాలిబన్‌ ముఠా సభ్యలను హతమార్చాడు. కంటెయినర్లలో బంధించి ఎడారిలో వదిలి వేసేవాడట. ఊపిరాడక వారంతా చనిపోయేవారట! అలా అని ఈయన గురించి చెప్పుకుంటుంటారు.

మొన్నటి వరకు హాయిగానే ఉన్నారు దోస్తమ్‌! ఎప్పుడైతే అమెరికా దళాలు అఫ్గానిస్తాన్‌ నుంచి నిష్క్రమించాయో.. ఎప్పుడైతే తాలిబన్లు దేశాన్ని హస్తగతం చేసుకున్నరో అప్పట్నుంచే ఈయనకు కష్టాలు మొదలయ్యాయి. తాలిబన్లకు దొరికితే చంపేస్తారని తెలుసు. అందుకే ప్రాణప్రదమైన ప్యాలెస్‌ను వదిలిపెట్టేసి ప్రాణాలు అరచేత పట్టుకుని ఉజ్బెకిస్తాన్‌కు పారిపోయాడు దోస్తమ్‌. ఆయన వెళ్లిపోయాక సకల వసతులు ఉన్న ఆ ఇంధ్రభవనాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడా ప్యాలెస్‌లో తాలిబన్లలోని శక్తివంతమైన కమాండర్లలో ఒకరైన కారీ సలాహుద్దీన్‌ అయౌబీ ఉంటున్నారు. ఆయన భద్రతా సిబ్బంది కూడా అందులోనే ఉంటున్నారు. ఆ భవనంలో నివాసం అయితే ఉంటున్నాం కానీ లగ్జరీ లైఫ్‌కు అలవాటుపడమోమని అయౌబీ అంటున్నారు.

ఆ సంగతి వదిలేస్తే తాలిబన్‌ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌ చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు. అమెరికా బలగాలు, అఫ్గానిస్తాన్‌ సైనికులకు దొరక్కుండా చాలా ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నారు. అమెరికా సైనికుల కళ్లు గప్పి కాలబూల్‌లోనే ఉన్నానని, దేశమంతా తిరిగానని చెప్పుకొచ్చాడు. తన జాడ పసిగట్టడానికి అమెరికా బలగాలు స్థానికులకు డబ్బులు కూడా ఇచ్చేవని అన్నాడు. తాను ఎప్పుడూ అఫ్గానిస్తాన్‌ను వదిలి వెళ్లాలనుకోలేదని చెప్పాడు.

Read Also…  Cotton Mask: కరోనా నుంచి రక్షణకు రెండు లేయర్ల కాటన్ మాస్క్ ఎంత ఉపయోగమో తెలుసా? తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.