Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 6.5గా తీవ్రత నమోదు

ఇండోనేషియాలోని తూర్పు ప్రాంతంలోని పపువాలో ఆదివారం తెల్లవారుజామున భయంకర భూకంపం సంభవించింది. పపువా ప్రావిన్స్ రాజధాని జయపురాలోని ఉప జిల్లా అబేపురాకు ఈశాన్యంగా 162 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.5 గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. దాదాపు10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంతవరకూ ఎలాంటి..

Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 6.5గా తీవ్రత నమోదు
Indonesia Earthquake
Follow us

|

Updated on: Dec 31, 2023 | 10:56 AM

పపువా, డిసెంబర్ 31: ఇండోనేషియాలోని తూర్పు ప్రాంతంలోని పపువాలో ఆదివారం తెల్లవారుజామున భయంకర భూకంపం సంభవించింది. పపువా ప్రావిన్స్ రాజధాని జయపురాలోని ఉప జిల్లా అబేపురాకు ఈశాన్యంగా 162 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.5 గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. దాదాపు10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంతవరకూ ఎలాంటి నివేదికలు వెలువడలేదు. ప్రస్తుతానికి సునామీ ప్రమాదం లేదని, అయితే భూకంపం భూమిలో కేంద్రీకృతమై ఉన్నందున మరికొన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇండోనేషియాలోని మెటీరియాలజీ, వాతావరణ శాస్త్రం, జియోఫిజికల్ ఏజెన్సీ హెచ్చరించాయి. భూకంపం వల్ల ఎటువంటి సునామీ ముప్పు లేదని హవాయిలోని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సైతం వెల్లడించింది.

కేవలం 62,250 జనాభా కలిగిన అబేపురా ఇండోనేషియాలోని అతి తక్కువ జనాభా కలిగిన పట్టణాలలో ఒకటి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన భూకంపం ధాటికి అబేపురా ప్రావిన్స్‌ ప్రభావితమైంది. నాటి ప్రమాదంలో నీళ్లలో తేలియాడే రెస్టారెంట్ సముద్రంలో కూలిపోవడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. ఇండోనేషియా 270 మిలియన్లకు పైగా జనాభా కలిగిన విస్తారమైన ద్వీపసమూహం. పసిఫిక్ బేసిన్‌లోని అగ్నిపర్వతాలు, ఫాల్ట్ లైన్‌ల ఆర్క్‌ల కారణంగా ఇక్కడి ద్వీపాల్లో తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి.

పశ్చిమ జావాలోని సియాంజూర్ నగరంలో నవంబర్ 21న సంభవించిన భూకంపం వల్ల ధాటికి దాదాపు 331 మంది మరణించారు. దాదాపు 600 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.6గా నమోదైంది. సులవేసిలో 2018లో సంభవించిన భూకంపం వల్ల 4,340 మంది మరణించారు. ఇండోనేషియాలో ఇది అత్యంత ఘోరమైన భూకంపంగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక 2004లో హిందూ మహాసముద్ర భూకంపం వల్ల ఏర్పడిన సునామీ ధాటికి దాదాపు 12 దేశాల్లో 2,30,000 మందికి పైగా మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది ఇండోనేషియాలోని అచే ప్రావిన్స్‌కు చెందినవారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.https://tv9telugu.com/world

1146168,1146024,1145989,1146042

Latest Articles
31సార్లు సందర్శించి.. 72శాతం పోలవరం పనులు పూర్తి చేశా'.. ఏపీ సీఎం
31సార్లు సందర్శించి.. 72శాతం పోలవరం పనులు పూర్తి చేశా'.. ఏపీ సీఎం
సెప్టెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు,ద‌ర్శ‌న టికెట్ల కోటారిలీజ్
సెప్టెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు,ద‌ర్శ‌న టికెట్ల కోటారిలీజ్
తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద ప్రైవేటు సెక్యూరిటీ..
తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద ప్రైవేటు సెక్యూరిటీ..
ఇంట్లోనే ఈజీగా మసాలా మొక్కలను పెంచేయండిలా..
ఇంట్లోనే ఈజీగా మసాలా మొక్కలను పెంచేయండిలా..
దీపికాకు బంపర్ ఆఫర్.. బిగ్ బాస్ సీజన్ 8‌లో బ్రహ్మముడి నటి..?
దీపికాకు బంపర్ ఆఫర్.. బిగ్ బాస్ సీజన్ 8‌లో బ్రహ్మముడి నటి..?
మొలకెత్తిన గోధుమలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..! మిరాకిల్స్‌
మొలకెత్తిన గోధుమలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..! మిరాకిల్స్‌
కుర్రకారు హృదయాలతో ఆటలాడుతున్న దివి.. నీకిది న్యాయమా.!
కుర్రకారు హృదయాలతో ఆటలాడుతున్న దివి.. నీకిది న్యాయమా.!
తెల్ల బట్టలను ఇలా ఉతికితే మల్లెపువ్వులా మెరుస్తాయి!
తెల్ల బట్టలను ఇలా ఉతికితే మల్లెపువ్వులా మెరుస్తాయి!
ఈ కోమలి అందానికి ఆ దేవకన్యలు కూడా దాసోహం అనాల్సిందే..
ఈ కోమలి అందానికి ఆ దేవకన్యలు కూడా దాసోహం అనాల్సిందే..
విండీస్‌లొ టీమిండియా రికార్డులు.. గెలవాలంటే 11మంది పోరాడాల్సిందే
విండీస్‌లొ టీమిండియా రికార్డులు.. గెలవాలంటే 11మంది పోరాడాల్సిందే
చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీష్ రావు
చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీష్ రావు
నన్ను నేనే మిస్ అవుతున్నాను.. హార్ట్‌ ను టచ్ చేస్తున్న సేతుపతి..
నన్ను నేనే మిస్ అవుతున్నాను.. హార్ట్‌ ను టచ్ చేస్తున్న సేతుపతి..
హ్యాట్సాఫ్..రవితేజ గారు.! తీవ్ర మెడనొప్పి లెక్కచేయని మాస్‌రాజా..!
హ్యాట్సాఫ్..రవితేజ గారు.! తీవ్ర మెడనొప్పి లెక్కచేయని మాస్‌రాజా..!
స్టార్ హీరోయిన్ ఘరానా మోసం.? కోర్టుకెక్కిన వ్యాపారి..
స్టార్ హీరోయిన్ ఘరానా మోసం.? కోర్టుకెక్కిన వ్యాపారి..
హజ్‌ యాత్ర ప్రారంభం.. 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఎడారిలో యాత్ర.!
హజ్‌ యాత్ర ప్రారంభం.. 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఎడారిలో యాత్ర.!
అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది.. కశ్మీర్లో ఉగ్రవాదులు..
అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది.. కశ్మీర్లో ఉగ్రవాదులు..
ప్రాణాలకు తెగించి కాపాడాడు.. ఆపై పొట్టుపొట్టుగా కొట్టాడు..
ప్రాణాలకు తెగించి కాపాడాడు.. ఆపై పొట్టుపొట్టుగా కొట్టాడు..
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.