AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంబానీ ఇంట ప్రీ-వెడ్డింగ్ వేడుకలో చోరీ.. ఐదుగురు అరెస్టు !!

అంబానీ ఇంట ప్రీ-వెడ్డింగ్ వేడుకలో చోరీ.. ఐదుగురు అరెస్టు !!

Phani CH
|

Updated on: Mar 20, 2024 | 11:27 AM

Share

ఇటీవలే గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ రెండవ కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయితే ఈ ముందస్తు పెళ్లి వేడుకల వేదిక వద్ద చోరీ జరిగింది. లాప్‌టాప్‌లు, రూ.10 లక్షల నగదు చోరీకి పాల్పడ్డ ఐదుగురు దొంగలను ఢిల్లీలో పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. నిందితులందరూ తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన వారుగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 12న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది.

ఇటీవలే గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ రెండవ కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయితే ఈ ముందస్తు పెళ్లి వేడుకల వేదిక వద్ద చోరీ జరిగింది. లాప్‌టాప్‌లు, రూ.10 లక్షల నగదు చోరీకి పాల్పడ్డ ఐదుగురు దొంగలను ఢిల్లీలో పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. నిందితులందరూ తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన వారుగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 12న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది. ఈ క్రమంలో అక్కడి రాజ్‌కోట్ వేదిక వద్ద పార్క్ చేసిన మెర్సిడెస్ కారు అద్దాలను పగలగొట్టిన నిందితులు రూ.10 లక్షల నగదు, ఓ లాప్‌టాప్‌ను చోరీ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా మరో ఐదుగురి పేర్లు బయటపడ్డాయి. ఈ క్రమంలో పోలీసులు జగన్, దీపక్, గుణశేఖర్, ఏకాంబరం‌లను ఢిల్లీలో అరెస్టు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అరుణాచల్‌ ప్రదేశ్ మాదే.. చైనా ప్రకటన

Ram Charan: రామ్​ చరణ్ RC 16లో యానిమల్ విలన్

ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌