Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Duty Over: నా డ్యూటీ అయిపోయింది విమానాన్ని నడపను.! విమానాన్ని వదిలేసి వెళ్లిపోయిన పైలట్‌..

Duty Over: నా డ్యూటీ అయిపోయింది విమానాన్ని నడపను.! విమానాన్ని వదిలేసి వెళ్లిపోయిన పైలట్‌..

Anil kumar poka

|

Updated on: Aug 03, 2023 | 10:49 AM

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ విమానాశ్రయంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్‌కు పైలట్‌ నిరాకరించడంతో దాదాపు వందమంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రాజ్‌కోట్‌ నుంచి దిల్లీకి బయలుదేరాల్సిన విమానంలో ఈ పరిస్థితి తలెత్తింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ముగ్గురు బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు. అప్పటికే తన షిఫ్ట్ పూర్తయి పని గంటలకు మించి విధులు నిర్వహించడంతో.. విమానం టేకాఫ్‌కు పైలట్‌ ససేమిరా అన్నారు.

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ విమానాశ్రయంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్‌కు పైలట్‌ నిరాకరించడంతో దాదాపు వందమంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రాజ్‌కోట్‌ నుంచి దిల్లీకి బయలుదేరాల్సిన విమానంలో ఈ పరిస్థితి తలెత్తింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ముగ్గురు బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు. అప్పటికే తన షిఫ్ట్ పూర్తయి పని గంటలకు మించి విధులు నిర్వహించడంతో.. విమానం టేకాఫ్‌కు పైలట్‌ ససేమిరా అన్నారు. దీనికి ఎయిరిండియా వివరణ ఇచ్చింది.‘‘పైలట్లు తమ పరిమితులను దాటి విధులు నిర్వహించడం వీలుకాదు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం’’ అని తెలిపింది.

గత నెల కూడా లండన్‌ నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిరిండియా విమానంలో ఇదే పరిస్థితి ఎదురైంది. వాతావరణం అనుకూలించక జైపుర్‌లో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. రెండు గంటల తర్వాత ఢిల్లీకి బయలుదేరేందుకు పని గంటల కారణంగా పైలట్‌ నిరాకరించడంతో దాదాపు 350 మంది ప్రయాణికులు జైపూర్‌ ఎయిర్‌పోర్టులో ఇబ్బందులు పడ్డారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...