Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆహ్వానం వీడియో

ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆహ్వానం వీడియో

Samatha J
|

Updated on: Oct 12, 2025 | 4:59 PM

Share

గాజాలో శాంతి స్థాపన కోసం ఈజిప్టులో జరగనున్న శాంతి సదస్సుకు ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ఈజిప్టు అధ్యక్షుడు అల్-సీసీ ఆహ్వానం పలికారు. 20కి పైగా దేశాధినేతలు హాజరు కానున్నారు. మోదీ హాజరుపై ఇంకా పీఎంవో నుంచి ధ్రువీకరణ రాలేదు. మోదీ గతంలో గాజా శాంతి ప్రయత్నాలను స్వాగతించారు.

ప్రపంచ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో హౌడీ మోడీ అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఇప్పుడు గాజాలో శాంతి స్థాపన కోసం ఈజిప్టులో జరగనున్న శాంతి సదస్సుకు ప్రధాని మోదీకి ఆహ్వానం పలికారు. ట్రంప్‌తో పాటు ఈజిప్టు అధ్యక్షుడు అల్-సీసీ కూడా మోదీని ఈ సదస్సుకు ఆహ్వానించారు.ఈజిప్టులో జరగనున్న ఈ శాంతి సదస్సులో మొత్తం 20 మందికి పైగా దేశాధినేతలు పాల్గొననున్నారు. గాజా ప్రాంతంలో శాంతి స్థాపనకు అమెరికా, ఈజిప్టు సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. అయితే, ఈజిప్టులో జరిగే ఈ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుపై ఇంకా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఎటువంటి అధికారిక ధ్రువీకరణ చేయలేదు. గతంలో ప్రధాని మోదీ గాజాలో శాంతి స్థాపన ప్రయత్నాలను స్వాగతిస్తూ ఒక ట్వీట్‌ కూడా చేశారు. రేపు ఈజిప్టులో జరగనున్న గాజా శాంతి ఒప్పందం కీలకమైన పరిణామం కానుంది.

మరిన్ని వీడియోల కోసం :

గర్ల్స్‌ టాయిలెట్‌లో హిడెన్‌ కెమెరా కలకలం వీడియో

రంగు డబ్బాతో పాఠశాలకు స్టూడెంట్స్.. ఎందుకో తెలిస్తే అవాక్కు అవుతారు వీడియో

30 ఏళ్లనాటి ఆ కాగితాలే.. కోటీశ్వరుణ్ణి చేశాయి వీడియో