AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kakinada: సైక్లోన్ ప్రభావంతో కిక్కిరిసిన మార్కెట్లు, రైతు బజార్లు

Kakinada: సైక్లోన్ ప్రభావంతో కిక్కిరిసిన మార్కెట్లు, రైతు బజార్లు

Phani CH
|

Updated on: Oct 27, 2025 | 7:21 PM

Share

కాకినాడలో మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో నిత్యావసర వస్తువులు, కూరగాయల కోసం మార్కెట్లు, రైతు బజార్లు కిక్కిరిసిపోయాయి. తుఫాన్ సమయంలో కొరత లేదా ధరలు పెరగవచ్చనే భయంతో ప్రజలు వారం రోజులకు సరిపడా సరుకులను ముందస్తుగా కొనుగోలు చేస్తున్నారు. నందిగామ రైతు బజార్‌లో రద్దీ భారీగా పెరిగింది.

మొంథా తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో కాకినాడ జిల్లాలో నిత్యావసర వస్తువులు, కూరగాయల కొనుగోళ్లు జోరందుకున్నాయి. తుఫాన్ ప్రభావంతో మార్కెట్లు, రైతు బజార్లు రద్దీగా మారాయి. నందిగామ రైతు బజార్‌తో పాటు ఇతర మార్కెట్లలోనూ జనం బారులు తీరారు. వారం రోజులకు సరిపడా సరుకులను, ముఖ్యంగా కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. తుఫాన్ సమయంలో కూరగాయల ధరలు పెరుగుతాయని, లభ్యత తగ్గిపోవచ్చని భయంతోనే ప్రజలు ముందస్తుగా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో కాకినాడలో వ్యాపారాలు అనూహ్యంగా పెరిగాయి. మొంథా తుఫాన్ కారణంగా మూడు రోజులు సెలవులు ప్రకటించడంతో పాటు, కార్తీక మాసం ప్రభావం కూడా కొనుగోళ్ల రద్దీకి కారణమవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, తుఫాన్ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Supreme Court: వీధి కుక్కల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

Delhi Air Pollution: ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయుకాలుష్యం

సలార్‌ సినిమాను వదులకుని చరణ్‌ తప్పు చేశాడా ??

ఆకాశంలో అద్భుత దృశ్యం.. పులకించిపోయిన భక్తులు

ఆన్‌లైన్‌లో రూ.4 కోట్ల వాచ్‌ ఆర్డర్‌ చేశాడు.. డెలివరీ వచ్చింది చూసి