AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: వీధి కుక్కల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court: వీధి కుక్కల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

Phani CH
|

Updated on: Oct 27, 2025 | 7:11 PM

Share

వీధి కుక్కల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ విషయంపై తీసుకున్న చర్యల నివేదికలు సమర్పించని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ మినహా మిగతా రాష్ట్రాల సీఎస్‌లు వచ్చే సోమవారం హాజరుకావాలని ఆదేశించింది. వివరణ ఇవ్వకుంటే జరిమానా విధించబడుతుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది.

వీధి కుక్కల కేసులపై సుప్రీంకోర్టులో తీవ్ర స్థాయిలో విచారణ జరుగుతోంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వీధి కుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలపై పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు నివేదికలు సమర్పించడంలో విఫలమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను తేలికగా తీసుకుంటున్నారని ఆక్షేపించింది. దీంతో, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే సోమవారం కోర్టు ఎదుట స్వయంగా హాజరై, ఈ విషయంలో తీసుకున్న చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ చీఫ్ సెక్రటరీలు హాజరుకాకపోయినా, సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోయినా, వారిపై జరిమానా విధించే చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పరిణామం రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడిని పెంచుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Delhi Air Pollution: ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయుకాలుష్యం

సలార్‌ సినిమాను వదులకుని చరణ్‌ తప్పు చేశాడా ??

ఆకాశంలో అద్భుత దృశ్యం.. పులకించిపోయిన భక్తులు

ఆన్‌లైన్‌లో రూ.4 కోట్ల వాచ్‌ ఆర్డర్‌ చేశాడు.. డెలివరీ వచ్చింది చూసి

జాతి వైరం మరచి.. పసికూనల ఆకలి తీర్చి