తాబేళ్ల దొంగలు.. వెస్ట్‌ బెంగాల్‌ నుంచి చెన్నైకి తరలింపు

విశాఖ లో కొద్దిరోజుల క్రితం పులి చర్మం పట్టుకున్న డిఆర్ఐ అధికారులు.. తాజాగా వందల సంఖ్యలో తరలిపోతున్న తాబేళ్ల స్మగ్లింగ్ కు బ్రేక్ వేశారు. పక్కా సమాచారంతో రైల్వే స్టేషన్లో మాటు వేసి.. ఇద్దరు అనుమానితులను ట్రాక్ చేశారు. వారిని ప్రశ్నించడంతో తాబెళ్ళ అక్రమ రవాణా గుట్టు బయటపడింది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు... వారినుండి 396 అరుదైన తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు.

తాబేళ్ల దొంగలు.. వెస్ట్‌ బెంగాల్‌ నుంచి చెన్నైకి తరలింపు

|

Updated on: Mar 30, 2024 | 1:30 PM

విశాఖ లో కొద్దిరోజుల క్రితం పులి చర్మం పట్టుకున్న డిఆర్ఐ అధికారులు.. తాజాగా వందల సంఖ్యలో తరలిపోతున్న తాబేళ్ల స్మగ్లింగ్ కు బ్రేక్ వేశారు. పక్కా సమాచారంతో రైల్వే స్టేషన్లో మాటు వేసి.. ఇద్దరు అనుమానితులను ట్రాక్ చేశారు. వారిని ప్రశ్నించడంతో తాబెళ్ళ అక్రమ రవాణా గుట్టు బయటపడింది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు… వారినుండి 396 అరుదైన తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ బెంగాల్ నుంచి చెన్నైకు తాబేళ్లను తరలిస్తుళన్నట్టు గుర్తించారు. షాలిమార్ స్టేషన్ నుంచి ఈ ఇద్దరు ప్రయాణిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న తాబేళ్లలో నాలుగు అరుదైన జాతులున్నాయి. ఇండియన్ రూఫ్, ఇండియన్ క్రౌన్, బ్రౌన్ రూఫ్, ఇండియన్ టెంట్ రకం తాబేళ్లు ఉన్నట్టు గుర్తించారు డిఆర్ఐ అధికారులు. 396 లో 151 ఇండియన్ రూఫ్ తాబేళ్లు , 220 భారతీయ ఇండియన్ టెన్ట్ , 9 ఇండియన్ క్రౌన్ తాబేళ్లు , 16 బ్రౌన్ రూఫ్డ్ తాబేలు ఉన్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తిరుమల నడకమార్గంలో మళ్లీ చిరుత, ఎలుబంటి సంచారం

మందు తాగి బడికి వచ్చిన ఉపాధ్యాయుడు.. ఏం చేశాడంటే ??

లేగదూడకు బారసాల.. 500 మందికి విందు భోజనం

అర్ధరాత్రి ఫోన్‌ చేసి రూ.5 లక్షలు అడిగిన మనోజ్.. రామ్‌చరణ్‌ రియాక్షన్‌ ఇదే

10 రూపాయలతో కోటీశ్వరుడైపోయాడు !! అదృష్టం అంటే ఇతనిదే అంటున్న నెటిజన్లు

Follow us
Latest Articles